Saturday, 27 July 2024 01:54:17 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నితీశ్​ ఫ్రంట్ కు తెలంగాణలో నో టెంట్!

Date : 06 June 2023 06:31 PM Views : 488

జై భీమ్ టీవీ - జాతియం / : నితీశ్​ ఫ్రంట్ కు తెలంగాణలో నో టెంట్! ఇప్పటికే దూరమన్న బీఆర్ఎస్ వెనుకడుగు వేస్తున్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు సాధ్యం కాదన్న సీపీఎం ఈ నెల 12న మీటింగ్ వాయిదా బీజేపీ వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ఏర్పాటు చేస్తున్న కూటమికి తెలంగాణలో టెంటు ఉండేలా కనిపించడం లేదు. తాము ఆ కూటమిలో ఉండబోమని బీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పట్నాలో ఈ నెల 12న భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశం నిర్వహించాలని నితీశ్​ కుమార్ భావించారు. కలిసి వచ్చే అవకాశం ఉన్న పార్టీలకు ఆహ్వానం పంపారు. ఆ తేదీన రావడం కుదరదని కాంగ్రెస్, మరోపార్టీ తెలుపడంతో నితీశ్​ ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఇది అత్యంత కీలక సమావేశమని, దీనికి పార్టీ అధినేతలే రావాలని షరతు పెట్టినట్టు నితీశ్​ చెబుతున్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కార్యాచరణ ప్రకటిస్తామని నితీశ్​ వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తానని శపథం చేసి, గత ఏడాది బీజేపీతో సంబంధాలను తెంచుకున్న నితీశ్​ కుమార్.. ప్రతిపక్షాల ఐక్యత డ్రైవ్ లో భాగంగా చాలా మంది రాజకీయ ప్రముఖులతో మాట్లాడారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లతోనూ సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ చర్చలు జరిపారు. దీనిపై స్పందించిన ఏచూరి ఫ్రంట్ ఎప్పుడైనా ఎన్నికల తర్వాతే ఏర్పడుతుందని, ఎన్నికలకు ముందు సాధ్యం కాదని పేర్కొనడం గమనార్హం. కేరళలో తమకు కాంగ్రెస్ ప్రత్యర్థి అని దేశ వ్యాప్తంగా ఒకే నిబంధనను అప్లయ్ చేయలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం నితీశ్​ ఫ్రంట్ లో చేరితే తాము కేరళ రాష్ట్రాన్ని కోల్పోవలసి వస్తుందని పరోక్షంగా చెప్పారు. దాదాపు సీపీఐ కూడా అదే వైఖరితో ఉన్నట్టు తెలుస్తోంది. మోడీని గద్దె దించడమే వ్యూహం కావద్దు మోడీని గద్దె దించడమే వ్యూహంగా ఫ్రంట్ ఏర్పడటం కరెక్ట్ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల జాతీయ మీడియాకు చెప్పారు. జనతాదళ్ (యూ) సీనియర్ నాయకుడు త్యాగి ఇటీవల సీఎం కేసీఆర్ ను, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సంప్రదించి కూటమిలో చేరాలని విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. ఒక వ్యక్తి, పార్టీని అధికారం నుంచి దింపేందుకు ప్రతిపక్షాలను ఏకం చేయడంపై తమకు నమ్మకం లేదన్నారు. బీఆర్ఎస్ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోతున్నదని, తెలంగాణలో చేసిన అభివృద్ధిని దేశమంతా చేస్తామని వివరిస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని బట్టి రాజకీయం మారుతున్నందున థర్డ్, ఫోర్త్ ఫ్రంట్ ఫార్ములా ఇప్పుడు పనిచేయదని తాము భావిస్తున్నామని కేటీఆర్ చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుండటం, సీపీఎం ఎన్నికల తర్వాతే ఫ్రంట్ లు ఏర్పాడాలని భావిస్తుండటాన్ని పరిశీలిస్తే.. నితీశ్​ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ఫ్రంట్ కు తెలంగాణ లో టెంట్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :