జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్లో జూన్ 22న పార్కులు బంద్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా 22న పరిసరాల పార్కులకు సెలవు ప్రకటిస్తున్నట్లు హెచ్ఎండిఏ తెలిపింది. అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉండటంతో సామాన్య ప్రజానీకానికి, పార్కులకి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్న లుంబినీపార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్లను మూసివేయనున్నారు.
Admin