Monday, 12 May 2025 07:13:53 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

చంద్రబాబుకి స్కిన్ అలర్జీ.. జైలులోనే కొనసాగుతున్న చికిత్స.. అధికారులు ఏమన్నారంటే..?

Date : 13 October 2023 12:38 PM Views : 223

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిన్ ఎలర్జీకి గురయ్యారు. ఆయనకు స్కిన్ ఎలర్జీ రావడంతో గురువారం డాక్టర్లు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చర్మ సంబంధ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. అయితే. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి 33 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. ఆయనకు చికిత్స అందించారు. తాజాగా ఆయనకు స్కిన్ అలర్జీ కూడా రావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా డెర్మటాలజిస్టులను పిలిపించి జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా.. చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి జైల్లోనే ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిన్ అలర్జీ వచ్చినట్లు పేర్కొంటున్నారు ఫైబర్‌ నెట్‌ కేసులో 16న విచారణ.. ఇదిలాఉంటే.. ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. ఈ నెల 16న ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5గంటల లోపు చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. వాస్తవానికి చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఉంది. అటు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్‌ డేటా పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.మరోవైపు అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని హైకోర్ట్‌ తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది. నారా లోకేష్ అరెస్టు లేనట్లే.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నారా లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్‌ చేసింది. ఈ కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదని.. అందువల్ల ఆయనను అరెస్టు చేయబోమని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఒకవేళ కేసులో లోకేశ్‌ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామన్నారు. దీంతో లోకేశ్‌ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :