Thursday, 15 January 2026 06:54:09 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

గుడ్ న్యూస్: 2026 ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు.!

గుడ్ న్యూస్: 2026 ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు.!

Date : 16 December 2025 10:54 PM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఎంత పెంచితే .. ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్​దారులు 44 లక్షలు లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే దాదాపు రూ. 22 వేల కోట్లు అవసరం ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో సర్దడంపై అధికారుల కసరత్తు అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే.. దశలవారీగానైనా పెంచే ప్రయత్నం ఆరు గ్యారంటీల్లో ఒకటైన పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రత పింఛన్లను పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–-27) ఆరంభం నుంచే, అంటే ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంపును అమలులోకి తేవాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారంపై ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-–26) బడ్జెట్‌లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు రూ. 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పింఛన్లు పెంచితే.. దాదాపు రూ. 22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని ఓ ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్‌లో ఎలా సర్దుబాటు చేయాలి? అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలేమిటి? అనే అంశాలపై ఆర్థిక శాఖ అన్వేషిస్తున్నది. పెన్షనన్లు ఇప్పుడు ఇస్తున్న దానికి రూ. 500 పెంచడమా లేదా రూ. 1,000 పెంచడమా? అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పెంచడం సాధ్యం కానీ పరిస్థితుల్లో దశలవారీగా పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్ల విధానాన్ని పరిశీలిస్తే.. వివిధ వర్గాలకు వేర్వేరు మొత్తాలు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున చెల్లిస్తున్నది. డయాలసిస్ రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు పింఛను అందుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణ పింఛన్​ను రూ. 4,000కు, దివ్యాంగుల పింఛన్​ను రూ. 6,000కు పెంచాల్సి ఉంది. చేయూత గ్యారంటీ కింద.. పింఛన్ల పెంపు, రాజీవ్​ ఆరోగ్యశ్రీ బీమా పెంపును ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్​ ప్రకటించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపును అమలు చేస్తున్నది. ఇప్పుడు పింఛన్ల పెంపుపై ఫోకస్​ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. కొత్తవాళ్ల నుంచి దరఖాస్తులు! ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను పకడ్బందీగా చేయడం ద్వారా బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయొచ్చని, తద్వారా ఆదా అయిన నిధులను పెంపునకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న ఆలోచన ఉన్న ప్రభుత్వం.. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పింఛన్​కు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా పింఛను పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :