Thursday, 15 January 2026 06:55:32 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం

భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం

Date : 30 December 2025 08:53 AM Views : 56

జై భీమ్ టీవీ - క్రీడలు / : రాజ్‌‌‌‌కోట్/బెంగళూరు: న్యూజిలాండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌కు ఇండియా టీమ్ సెలెక్షన్ ముంగిట ఉత్తర ప్రదేశ్‌‌‌‌ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (101 బాల్స్‌‌‌‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 160 నాటౌట్) విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో విజృంభించాడు. దాంతో గ్రూప్‌‌‌‌–బిలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో యూపీ 54 రన్స్‌‌‌‌ తేడాతో బరోడాపై గెలిచింది. జురెల్‌‌‌‌కు తోడు రింకూ సింగ్ (63), ప్రశాంత్ వీర్ (35) రాణించడంతో యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 369/7 భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో బరోడా కెప్టెన్ క్రునాల్ పాండ్యా (82) పోరాడినప్పటికీ ఆ జట్టు 315 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఇక లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోయినా.. కెప్టెన్ రిషబ్ పంత్ (22) విఫలమైనా గ్రూప్‌‌‌‌–డి పోరులో ఢిల్లీ జట్టు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. తొలుత సౌరాష్ట్ర 320/7 స్కోరు చేసింది. విశ్వరాజ్‌‌‌‌సింగ్ జడేజా (115) సెంచరీతో మెరిశాడు. అనంతరం ప్రియాంశ్‌‌‌‌ ఆర్య (78), తేజస్వి దహియా (53), హర్ష్ త్యాగి (49)తో పాటు చివర్లో నవదీప్ సైనీ (34 నాటౌట్) మెరుపులతో ఢిల్లీ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. ఇక, టీమిండియాకు దూరమైన పేసర్ ముకేశ్ కుమార్ (5/59), వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ (3/69) సత్తా చాటడంతో బెంగాల్ 6 వికెట్ల తేడాతో చండీగఢ్‌‌‌‌పై గెలిచింది. కెప్టెన్ మనన్ వోహ్రా (122) సెంచరీతో చండీగఢ్ 48.2 ఓవర్లలో 319 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఛేజింగ్‌‌‌‌లో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (106), షాబాజ్ అహ్మద్ (76 నాటౌట్) రాణించడంతో బెంగాల్ 47.4 ఓవర్లలోనే 320/4 స్కోరు చేసి గెలిచింది.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :