Thursday, 15 January 2026 06:56:35 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు !

రేకులు, వెదురు తడకలను కోసుకుని బయటపడటంతో తప్పిన ప్రాణాపాయం మంటల్లో చిక్కుకుని పెంపుడు జంతువులు దహనం కాలిపోయిన సామాగ్రి.. ఐదుగురు అనుమానితుల అరెస్ట్

Date : 30 December 2025 08:57 AM Views : 60

జై భీమ్ టీవీ - జాతియం / : బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీపు దాస్‌ను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. పిరోజ్‌పూర్‌‌ జిల్లాలో హిందూ ఫ్యామిలీలు ఉంటున్న ఐదు ఇండ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఢాకా: బంగ్లాదేశ్‌‌లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీపు దాస్‌‌ను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. పిరోజ్‌‌పూర్‌‌‌‌ జిల్లా దుమ్రితల గ్రామంలోని ముస్లిం ప్రభావిత ప్రాంతంలో ఒకే హిందూ కుటుంబానికి (సాహా కుటుంబం) చెందిన ఐదు ఇండ్లకు బయట గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోతున్న సమయంలో బయట నుంచి తలుపులకు గడియ పెట్టి, ఒక గదిలో బట్టలు కుక్కి నిప్పంటించారు. దీనివల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న 8 మంది సభ్యులు రేకులు, వెదురు తడకలను కోసుకుని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, వారి సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యింది. వారి పెంపుడు జంతువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి. ఐదుగురి అరెస్ట్‌‌.. ఈ ఘటనపై పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్‌‌పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ.. ‘‘మేం ఉదయం లేచే సరికి ఇండ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాం. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి వెదురు ఫెన్సింగ్‌‌ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి’’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :