Thursday, 15 January 2026 08:22:18 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

బెంగళూరు ఎయిర్‌పోర్టులో కొత్త క్యాబ్ రూల్స్..

ప్రయాణికుల ఆగ్రహం..

Date : 17 December 2025 12:26 AM Views : 56

జై భీమ్ టీవీ - జాతియం / : బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ వద్ద ట్రాఫిక్ గందరగోళాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రయాణికులు, క్యాబ్ ఆపరేటర్ల నుంచి తీవ్ర నిరసనకు దారితీసింది. ఈ కొత్త క్యాబ్ రూల్స్ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న ప్రైవేట్ క్యాబ్‌లలో వచ్చే ప్రయాణికులు నేరుగా అరైవల్ కర్బ్‌సైడ్ వద్ద దిగడానికి అనుమతి లేదు. కేవలం అధికారిక ఎయిర్‌పోర్ట్ అగ్రిగేటర్ క్యాబ్ సర్వీసులకు మాత్రమే దీనిని అనుమతిస్తున్నారు. పాత విధానం పూర్తిగా మారిపోవడంతో.. విమానం దిగిన ప్రయాణికులు తమ సామానంతో దాదాపు 800 మీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సుదీర్ఘ నడకలో ఎలివేటెడ్ వాక్‌వేలు, ర్యాంపులు, పొడవైన కారిడార్‌లు, అనేక లిఫ్ట్‌లను దాటాల్సి ఉంటుంది. దీనికి 15 నుండి 17 నిమిషాలు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, నడవలేనివారు, చిన్న పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఇది ఒక పెద్ద కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి ప్రయాణించిన చాలా మంది దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ముందుగా తెలియాలిగా అంటూ మండిపడుతున్నారు. టర్మినల్-2 లో డ్రైవర్లకు పిక్-అప్ కోసం కేవలం ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. ఇది వారితో పాటు ప్రయాణికులకు తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. అధికారిక ఎయిర్‌పోర్ట్ క్యాబ్‌లను ఎంచుకోనివారు తమ బుకింగ్‌లను రద్దు చేసుకుని, ఖరీదైన ఎయిర్‌పోర్ట్ క్యాబ్‌లను ఆశ్రయించడం వలన ప్రైవేట్, అవుట్‌స్టేషన్ క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజా మార్పులకు సంబంధించి ముందుగా సమాచారం లేకపోవడం, సరైన సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవటంతో సోమవారం ఉదయం విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. లక్నో నుంచి వచ్చిన మహ్మద్ ఇర్ఫాన్ అనే ప్రయాణికుడు, విమానాశ్రయం రాక అనేది సులభంగా ఉండాలి, కానీ ఇది అనవసరమైన ఒత్తిడిగా మారిందని అన్నారు. ప్రస్తుతం కేవలం అధికారిక ఎయిర్‌పోర్ట్ అగ్రిగేటర్ సేవలకు చెందిన ట్యాక్సీలకు మాత్రమే కర్బ్‌సైడ్ పిక్-అప్ సౌకర్యం కలిగి ఉండటంతో పిల్లలు, పెద్దవారితో ప్రయాణించే వారు సరైన ఏర్పాట్లు చేసుకోవాలని ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు సూచిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :