Thursday, 15 January 2026 06:54:05 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

నేషనల్ హెరాల్డ్ కేసు..ఢీల్లీ కోర్టు కీలక నిర్ణయం..

రాహుల్, సోనియాలకు ఊరట

Date : 17 December 2025 12:27 AM Views : 62

జై భీమ్ టీవీ - జాతియం / : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీలాండరింగ్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మంగళవారం(డిసెంబర్ 16) కొట్టివేసింది.ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి (పిసి యాక్ట్) విశాల్ గోగ్నే తోసిపుచ్చారు. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీలను ప్రధాన నిందితులుగా ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.నేషనల్ హెరాల్డ్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు చెందిన రూ.2వేల కోట్లకు పైగా ఆస్తుల దుర్వినియోగం కేసులో వారిని నిందితులుగా ఆరోపించింది. అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఎఫ్ఐఆర్ ఆధారంగా ఛార్జీషీటు దాఖలు చేసింది ఈడీ. మోసం,ఆస్తి దుర్వినియోగం ,నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో గాంధీ కుటుంబం, సామ్ పిట్రోడా, సుమన్ దూబే, యంగ్ ఇండియన్ లను నిందితులుగా పేర్కొంది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 66 (2) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అందించిన సమాచారం ఆధారంగా ఈ FIR నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై కోర్టు ఇచ్చిన కాగ్నిసెన్స్ ఆర్డర్ ఆధారంగా ఈడీ చర్యలు చేపట్టింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :