జై భీమ్ టీవీ - సినిమా / : ఒకప్పుడు టాలీవుడ్లో బిజీ హీరోగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ ఫుల్ ఫామ్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ‘మిరాయ్’ సినిమాతో విలన్గా భారీ విజయాన్ని అందుకున్న మనోజ్, ఇప్పుడు హీరోగా ‘డేవిడ్ రెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్చరణ్ క్యామియో చేస్తారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. మనోజ్కు క్లోజ్ ఫ్రెండ్ అయిన శింబు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. బ్రిటిష్ పాలన నేపథ్యంలోని పీరియడ్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి నెలకొంది. అదే సమయంలో ఒకప్పుడు టాలీవుడ్లో బిజీ హీరోగా వెలుగొందిన మంచు మనోజ్ పేరు కూడా మళ్లీ ఇండస్ట్రీలో చర్చకు వస్తోంది. వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంగా కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైన మనోజ్… ఇప్పుడు కొత్త ఉత్సాహంతో కెరీర్ను మళ్లీ ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పేర్లు ఒకే ప్రాజెక్ట్తో లింక్ కావడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు యంగ్ హీరోల జాబితాలో మంచి స్థానం సంపాదించుకున్న మంచు మనోజ్, అనుకోని బ్రేక్తో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. వరుస పరాజయాలు ఆయన కెరీర్పై ప్రభావం చూపగా, వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు మరింత దూరం తీసుకెళ్లాయి. దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్, ఒక దశలో ఇండస్ట్రీకి గుడ్బై చెప్పినట్టే కనిపించాడు. అయితే గత ఏడాది నుంచి మళ్లీ నటనపై దృష్టి పెట్టి, సెకండ్ ఇన్నింగ్స్ను మొదలుపెట్టాడు. ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. రీఎంట్రీ మూవీగా వచ్చిన ‘భైరవం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోయినా, ‘మిరాయ్’ మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాల్లోనూ మనోజ్ హీరోగా కాకుండా విలన్ పాత్రల్లో కనిపించడం విశేషం. ముఖ్యంగా ‘మిరాయ్’లో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేసి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో టాలీవుడ్కు ఒక బలమైన విలన్ దొరికాడనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే మనోజ్ నెగెటివ్ పాత్రలకే పరిమితం కావడం లేదు. హీరోగా కూడా మళ్లీ తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా ‘ డేవిడ్ రెడ్డి ’ అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం క్యాస్టింగ్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ‘డేవిడ్ రెడ్డి’లో రెండు కీలక అతిథి పాత్రలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో ఒక పాత్రను తమిళ స్టార్ హీరో శింబు చేయనున్నాడని సమాచారం. మనోజ్కు, శింబుకు మంచి స్నేహం ఉండటంతో ఈ వార్తకు బలం చేకూరుతోంది. అంతేకాదు, మరో క్యామియో కోసం మెగా పవర్ స్టార్ రామ్చరణ్ను సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. మనోజ్, చరణ్ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా బిజీగా ఉన్న చరణ్… ఈ దశలో క్యామియో చేయడం సాధ్యమా అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంటే, తన ఇమేజ్కు ఇబ్బంది లేకపోతే చరణ్ ఆలోచించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ‘డేవిడ్ రెడ్డి’ కథ బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందున్న సామాజిక పరిస్థితులు, ఒక పోరాట యోధుడి ప్రయాణం ఈ చిత్రానికి ప్రధానాంశంగా ఉండబోతున్నాయట. హనుమరెడ్డి యక్కంటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీస్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనతో అనుభవం ఉన్న టెక్నీషియన్లను ఎంపిక చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు విలన్గా తన రీఎంట్రీని సక్సెస్గా మలచుకున్న మంచు మనోజ్… హీరోగా ‘డేవిడ్ రెడ్డి’ ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.
Admin