Thursday, 15 January 2026 08:38:28 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

డిసెంబర్, జనవరి నెలల్లో తిరుమల వెళ్తున్నారా..

ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులే..

Date : 16 December 2025 11:20 PM Views : 36

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / తిరుపతి జిల్లా : తిరుమల భక్తులకు అలర్ట్.. డిసెంబర్, జనవరి మాసాలలో తిరుమలలో అనేక పర్వదినాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పర్వదినాల సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు డిసెంబర్ 30 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తు్న్న సంగతి తెలిసిందే. పది రోజుల పాటు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగానూ వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ నుంచి జనవరి నెల వరకూ తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఉత్సవాలు, పర్వదినాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్, జనవరి నెలల్లో పర్వదినాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని.. తమకు సహకరించాలని టీటీడీ కోరింది. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబర్ 23న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి ముందు రోజు అంటే డిసెంబర్ 29వ తేదీ, అలాగే వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30వ తేది), వైకుంఠ ద్వార దర్శనాలు ( డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు), రథ సప్తమి ( జనవరి 25) రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఆయా రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ దర్శనాలకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆయా రోజులకు ముందురోజు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది. టీటీడీకి కార్లు విరాళం.. మరోవైపు తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు, కానుకలు అందించే సంగతి తెలిసిందే. టీటీడీకి భారీ ఎత్తున విరాళాలు అందిస్తూ టీటీడీ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు సాయం చేస్తుంటారు పలువురు భక్తులు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ కారును టీటీడీకి విరాళంగా అందించింది. ఆ సంస్థ తరుఫున అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) కారును విరాళంగా అందించారు. అలాగే మరో తమిళనాడు భక్తుడు కూడా టీటీడీకి కారును విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును టీటీడీకి విరాళంగా అందించారు. బుధవారం రోజున శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు తాళాలు అందించారు. టీటీడీకి కోటి రూపాయలు విరాళం మరోవైపు తిరుమల శ్రీవారి మంగళవారం రోజున భారీ విరాళం అందింది. తమిళనాడుకు చెందిన భక్తురాలు టీటీడీకి కోటి రూపాయలు విరాళంగా అందించింది. ఈరోడ్‌కు చెందిన ఎం.సౌమ్య అనే భక్తురాలు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి.. దాతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :