Thursday, 15 January 2026 08:35:30 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

అదీ పవన్ కళ్యాణ్ అంటే..

కేవలం 9 రోజుల్లోనే.. రూపురేఖలే మారిపోయాయ్..

Date : 16 December 2025 11:23 PM Views : 38

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఇటీవల చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సందర్శించారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటన సమయంలో స్కూలులో కంప్యూటర్ ల్యాబ్ లేకపోవటాన్ని గుర్తించారు. అలాగే లైబ్రరీలో పుస్తకాలు తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. వీటిని సమకూరుస్తానని విద్యార్థులకు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్.. కేవలం 9 రోజుల్లోనే తన హామీ నెరవేర్చారు. 25 లక్షలు ఖర్చు చేసి 25 కంప్యూటర్లు, పుస్తకాలను అందజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుని దటీజ్ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నారు. హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లో ఓ పాఠశాలకు.. 25 కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్లో అందుబాటులో ఉన్న గ్రంథాలయం, ల్యాబ్, పాఠశాల గదులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ సమయంలోనే శారదా స్కూలు లైబ్రరీలో పుస్తకాలు తక్కువగా ఉండడాన్ని పవన్ కళ్యాణ్ గమనించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్కూలు లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. కేవలం తొమ్మిది రోజుల్లోనే తన హామీ నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయించారు. పుస్తకాలతో గ్రంథాలయాన్ని నింపేశారు.పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు పలు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అలాగే విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, ఒడియా వంటి భాషల పుస్తకాలను సమకూర్చారు. మొత్తం రూ. 25 లక్షల వరకూ ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ వీటిని ఏర్పాటు చేయించారు. సోమవారం రోజున చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు పాఠశాలల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టికి పెట్టారు. క్షేత్ర స్థాయి పర్యటనల సమయంలో పవన్ కళ్యాణ్ విద్యార్ధులకు అందుబాటులో ఉన్న వసతులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. వాటిని సమకూరుస్తుంటారు. గతంలో అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లిలో పర్యటించినప్పుడు.. ఆ గ్రామంలోని పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. రూ. 65 లక్షల సొంత నిధులు వెచ్చించి గ్రౌండ్ ఏర్పాటు చేయించారు. కడప మున్సిపల్ స్కూల్ సందర్శించిన సమయంలో.. అక్కడి పరిస్థితులను గమనించి మోడల్ కిచెన్ ఏర్పాటు చేయించారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :