Thursday, 15 January 2026 08:36:32 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

విశాఖపట్నంలో మరో ఐటీ దిగ్గజ సంస్థ..

20 ఎకరాల్లో క్యాంపస్, ఆ ప్రాంతం దశ తిరిగింది!

Date : 16 December 2025 11:13 PM Views : 39

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి.. విశాఖపట్నానికి గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌తో పాటుగా మరికొన్ని కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆయా కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. తాజాగా ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నంలో శాశ్వతంగా క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. అందుకే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా.. సూత్రప్రాయకంగా అంగీకరించినట్లు సమాచారం. ఎండాడ దగ్గర 20 ఎకరాలు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ప్రతినిధులతో చర్చించారని.. ఈ నెలలో ఒక క్లారిటీ వస్తుందంటున్నారు.. అలాగే ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన చేయనున్నారట.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :