Thursday, 15 January 2026 08:36:46 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

సంక్రాంతికి ఊరేళ్లే వారికి గుడ్‌న్యూస్..

డిసెంబర్‌లోనే నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు..

Date : 16 December 2025 11:41 PM Views : 40

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / రాజమహేంద్రవరం : నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు ప్రారంభంపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సేవలు డిసెంబర్‌లోనే అందుబాటులోకి రానున్నట్లు మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని.. ముందు ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది జనవరి నుంచి కాక.. డిసెంబర్ నుంచే ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి అని ఆయన తెలిపారు. అలానే పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు గురించి ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా వందే భారత్ రైలు సేవలు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ , నరసాపురం నుంచి చెన్నైకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ఈ సేవలు 2026, జనవరి 12 నుంచి ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ సంక్రాతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. వందే భారత్ రైలు ప్రారంభం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, జాతీయ రహదారుల నిర్మాణం, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో మంత్రి భూపతిరాజు వివరించారు. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. నరసాపురం, చెన్నై మధ్య వందే భారత్ రైలును ఈ నెల నుంచే ప్రారంభించాలన్న ప్రజల విన్నపాన్ని తాను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆయన తెలిపారు. తన విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపిందని.. డిసెంబర్ 15 నుంచే నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభం అవుతుందని తెలిపారు. అలానే, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్ట్‌కు అనుమతి రాబోతుందన్నారు. జల జీవన్‌ మిషన్‌ కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి భూపతిరాజు తెలిపారు. దీని ద్వారా 3.19 లక్షల గృహాలకు నీటి సౌకర్యం కలుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతానికి సైతం శుద్ధమైన తాగు నీరు అందించడం కోసం.. కొవ్వూరు మండలం బంగారమ్మపేట దగ్గర ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సుమారు 15.54 ఎకరాల్లో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. నీటి సరఫరా కోసం 2663 కి.మీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆకివీడు-దిగమర్రు, భీమవరం బైపాస్‌తో సహా ఎన్‌హెచ్‌ 165 రోడ్డు పనులకు అవసరమైన సర్వే, డీపీఆర్, సాంకేతిక సమస్యల పరిష్కారం, అనుమతులు పూర్తైనట్లు భూపతి రాజు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే, జనవరి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించడానికి టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. ఆదివారం భీమవరం, ఆచంటలో డయాలసిస్ సెంటర్లకు భూమిపూజ చేయనున్నట్లు మంత్రి భూపతిరాజు వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులను ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు. మొదటి దశలో, భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద రూ.2 కోట్లతో ఎనిమిది పడకల కేంద్రం, ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రూ.కోటితో మూడు పడకల కేంద్రం ఏర్పాటు చేయనన్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రూ.4 కోట్ల వ్యయంతో క్యాన్సర్ స్క్రీనింగ్‌ మొబైల్‌ యూనిట్‌ వ్యాన్‌ను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని భూపతిరాజు అన్నారు. ఈ వ్యాన్‌ ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలు అందిస్తుందని ఆయన తెలిపారు. మహిళలకు అక్కడికక్కడే పరీక్షలు చేసి రిపోర్టులు అందజేస్తామని వెల్లడించారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :