Saturday, 27 July 2024 09:15:11 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

గద్వాలలో న్యూడ్ కాల్స్ కలకలం..

మాయమాటలతో అమ్మాయిలు, వివాహితలను ట్రాప్‌ చేసిన మాయగాళ్లు

Date : 05 November 2022 01:41 PM Views : 455

జై భీమ్ టీవీ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల గలీజ్‌ కాల్స్‌ వ్యవహరంలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు, మహేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరొక నిందితుడు నిఖిల్‌ కోసం వెతుకుతున్నారు. ఇంకా ఈ న్యూడ్‌ కాల్స్‌ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గద్వాల్‌లో గలీజ్‌ కాల్స్‌ గబ్బులేపుతున్నాయి. యువతులు, మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఏ కాల్‌లో ఏ రాక్షసుడు ఉంటాడో తెలియని అరాచకం..ఒకడు ప్రేమంటాడు. మరొకడు స్నేహం అంటాడు. ఇంకొకడు జీవితం పంచుకుంటానంటాడు. వేరొకడు లివింగ్‌ రిలేషన్‌ అంటాడు. అన్నింటికీ ఆయుధం అందమైన మాటలే.. నభూతో నభవిష్యత్‌ నటనే.. గద్వాలలో ఇప్పుడిదే జరుగుతోంది..పచ్చని కాపురాలు బుగ్గిపాలవుతున్నాయి. అందమైన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇంతకీ ఈ కాల్స్‌ చేస్తున్న వాళ్లెవరు..వాళ్లకు కావాల్సిందేంటి..అసలు వాళ్ల మోడస్‌ ఆపరెండీ ఎలా ఉంటోంది.. సోషల్‌ మీడియాలో పరిచయమవుతున్నారు. అక్కడ ఫోటోలు చూసి చాట్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. అలా మెల్లగా పరిచయం పెంచుకుంటారు. నెంబర్లు తీసుకుంటారు. వాట్సాప్‌ చాట్స్‌, వీడియో కాల్స్‌తో మరింత దగ్గరవుతున్నారు. నీకు తోడుంటాను. నిన్ను గుండెల్లో దాచుకుంటాను. ఏలోటు లేకుండా చూసుకుంటాను లాంటి కమ్మని మాటలతో బుట్టలో పడేస్తున్నారు. న్యూడ్‌ కాల్స్‌ చేస్తున్నారు. వాళ్లకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వీళ్ల మాయలో పడిన అమ్మాయిలు, మహిళలు వాళ్లు చెప్పినట్లే చేస్తున్నారు. పూర్తిగా నమ్మేశాక.. న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అప్పుడు అసలైన క్రైమ్‌ సెక్స్‌ కహానీ మొదలవుతుంది.. అదేంటంటే.. తాము చెప్పిన వాళ్లతో గడపాలని..లేకపోతే న్యూడ్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని.. మాయగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా బెదిరిస్తున్న వాళ్లలో రాజకీయ నేతలున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కొంతమంది టీచర్లు, కౌన్సిలర్లు కూడా ఉన్నారట. ఈ ఇష్యూలో ఇద్దరిపై కేసు ఫైల్‌ చేశారు. మహేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడట. ఎప్పటినుంచో సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కూడా ఎలా బయటకొచ్చిందటే.. నిందితుల్లో విభేదాలు రావడం వల్ల ఈ గబ్బు బాగోతం రచ్చకెక్కింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :