Saturday, 18 May 2024 01:11:24 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సకల జనుల సౌభాగ్య తెలంగాణ అంటున్న బీజేపీ.. మేనిఫెస్టో ప్రధానాంశాలు ఇవే

Date : 19 November 2023 08:41 AM Views : 91

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణకు వరాల జల్లు కురిపిస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ప్రజలందరికీ సుపరిపాలన.. వెనుకబడిన వర్గాల సాధికారిత.. అందరికీ సమాన చట్టం వర్తింపు అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. ధరణి స్థానంలో మీ భూమి యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటినే జీతాలు వచ్చేలా చేయడంతో పాటు.. ఆరునెలలకోసారి గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా TSPSC రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తామంటోంది. 6 నెలల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై బలమైన వాదనలు వినిపిస్తామంటోంది. ప్రతి మండలంలో నోడల్ స్కూల్స్.. హైవేలు, ఇన్ఫోవేలు, రైల్వేలు, ఎయిర్‌వేల అభివృద్ధి.. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కేరిడార్‌ ప్రారంభానికి చొరవ.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు లాంటి హామీలను ప్రకటించింది. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామంటోంది. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణ.. రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్ల తొలగింపు, ఎస్సీలకు సాధికారత.. తెలంగాణ గల్ఫ్‌ నివాసితుల కోసం ప్రత్యేక నోడల్‌ విభాగం ఏర్పాటు చేస్తామంటోంది బీజేపీ. రైతులకు కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీతోపాటు రూ.2500 ఇన్‌పుట్ సాయం.. రైతులకు ఉచిత పంట బీమాతో పాటు వరికి రూ.3100 మద్దతు ధర ఇస్తామంటోంది కమలం పార్టీ. టర్మరిక్‌ సిటీగా నిమాజాబాద్‌‌ను అభివృద్ధి చేయడమే కాకుండా.. పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామంటోంది. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కూడా బీజేపీ హామీల్లో ఒకటి. ఇక మహిళలు, విద్యార్థులనుపైనా వరాల జల్లు కురిపించింది. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.. మహిళలకు 10లక్షల ఉద్యోగాల కల్పన.. ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు.. డ్వాక్రా సంఘాలకు 1% వడ్డీకే రుణాలు.. మహిళా రైతు కార్పోరేషన్.. ఇళ్లలో పనిచేసేవాళ్ల కోసం డొమెస్టిక్ వర్కర్స్ కార్పోరేషన్.. ఏడాదికి రూ.10లక్షల బీమా.. చేస్తామంటోంది. సింగరేణి ఉద్యోగులకు ఇన్‌కం ట్యాక్స్‌ రీయింబర్స్‌మెంట్.. మేడారం జాతరకు జాతీయ హోదా.. హైదరాబాద్‌లో ORR బిడ్డింగ్‌పై దర్యాప్తు, బిడ్డింగ్‌పై పున:సమీక్ష.. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీయాత్ర.. లాంటి హామీలు కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :