Sunday, 08 September 2024 08:01:48 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కోహ్లీ, గంభీర్ పై బీసీసీఐ సీరియస్..భారీగా జరిమానా

Date : 02 May 2023 11:19 AM Views : 146

జై భీమ్ టీవీ - క్రీడలు / : ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో హై డ్రామా చోటు చేసుకుంది. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్ వచ్చి గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఓపెనర్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.... ఆ టీం కోచ్ గంభీర్ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమిత్ మిశ్రా మధ్యలో వచ్చి కోహ్లీని తీసుకెళ్లగా...కేఎల్ రాహుల్ గంభీర్‌ను సముదాయించారు. అయితే ఈ గొడవపై బీసీసీఐ సీరియస్ అయింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఈ రెండు జట్ల ప్లేయర్లు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ జరిమానా... కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన గొడవలో ముఖ్యమైన ప్లేయర్లకు బీసీసీఐ ఫైన్ విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.21 కింద లెవెల్ 2 నిబంధనను ఉల్లంఘించినట్లు గంభీర్ ఒప్పుకున్నాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. కోహ్లీ కూడా లెవెల్ 2 తప్పిదం చేసినట్లు అంగీకరించాడంతో అతని మ్యాచ్ ఫీజులో కూడా 100 శాతం ఫైన్ విధించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ గొడవకు కారణమైన అఫ్ఘాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేసింది. బీసీసీఐ విధించిన జరిమానా ప్రకారం కోహ్లీ రూ.1.07 కోట్లు ఫైన్ కట్టనున్నాడు. గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్ రూ.1.79 లక్షలు ఫైన్ చెల్లించనున్నారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :