Saturday, 04 May 2024 09:16:56 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కార్తీకమాసం చివరి సోమవారం..

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల క్షేత్రం

Date : 11 December 2023 10:35 AM Views : 86

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / కర్నూల్ జిల్లా : కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆ మహా శివుడికి ఇష్టమైన పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచే కాకుండా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈరోజుతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీశైలంలో భక్తుల రద్దీ కారణంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లు కూడా కిక్కిరిసి పోయి ఉన్నాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. ముందు రోజు అర్ధరాత్రి దాటిన తరువాతి నుండే ఇక్కడి పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీకమాసంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు, అల్పాహారం వంటి సదుపాయాలను కంపార్ట్ మెంట్లలోనే సమకూర్చినట్టుగా ఈవో పెద్దిరాజు తెలిపారు. చివరి కార్తీక సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం చివరి కార్తీక సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక మాసంతం రేపు తెల్లవారుజాము వరకు ఉండటంతో రేపు కూడ శ్రీశైలంలో భక్తుల రద్దీ వుండే అవకాశం కూడ ఉంది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :