Saturday, 18 May 2024 12:36:43 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు బయల్దేరిన దంపతులు.. తుని నుండి చెన్నై వరకూ.. యాక్సిడెంట్‌తో కథ అడ్డం తిరిగింది..!

Date : 09 October 2023 01:55 PM Views : 66

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపిలోని తుని నుండి.... తమిళనాడులోని చెన్నై వరకూ బైక్ పై ప్రయాణం... ఆ దంపతులిద్దరికీ అలవాటే...గతంలోనూ ఇలాంటి లాంగ్ డ్రైవ్ లకు వెలుతుండేవారు. అయితే ఇందులో వింతేముంది అంటారా..? లాంగ్ డ్రైవ్ పూర్తి కాకుండానే పోలీసులకు చిక్కారు. ఎందుకంటారా..? వారి లాంగ్‌ డ్రైవ్‌ అసలు సంగతి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..అదేంటో తెలియాలంటే.. కంప్లీట్‌ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. చెన్నైలోని పెరంబదూర్ కు చెందిన కిషోర్, మీరా జాస్మిన్ దంపతులు, అక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే వీరికి కాకినాడ జిల్లా తునిలో బంధువులున్నారు. వీరిలో కేశవ్ అనే వ్యక్తితో ఎక్కువుగా వీరిద్దరికి పరిచయం ఉంది. ఈ నెల ఆరో తేదిన వీరిద్దరూ తుని చేరుకున్నారు. కేశవ్ ను కలిశారు. ఆ తర్వాత రోజు సాయంత్రం తుని నుండి బైక్ పై బయలు దేరారు. ఎప్పటి లాంటి ప్రయాణమే కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. గతంలోనూ వీళ్లిద్దరూ ఇదే విధంగా ప్రయాణించినట్లు తెలుస్తుంది. అయితే ఆదివారం తెల్లవారు జామున మూడు గంటల సమయలో మంగళగిరి వై జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న కిషోర్, మీరా జాస్మిన్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు పోలీసుల సాయంతో వీరిని మంగళగిరిలోని ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ స్పృహలో లేరు. దీంతో వీరి వివరాలు పోలీసులకు తెలియకుండా పోయాయి. ఆదివారం మద్యాహ్నం వరకూ ఎవరూ వీరి కోసం రాలేదు. దీంతో పోలీసులు బాధితులు వివరాలు తెలుసుకునేందుకు వీరి బైక్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరితో పాటు బైక్ పై ఉన్న బ్యాగ్ ను ఓపెన్ చేసి చూసి ఆశ్చర్య పోయారు. ఏదైనా ఆదారాలు దొరుకుతాయనుకుంటే ఏకంగా 8 కేజీల గంజాయి దొరికింది. దీంతో అవాక్కవ్వడం పోలీసులు వంతైంది. వెంటనే పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :