Saturday, 27 July 2024 01:59:31 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

చేసిన మంచిని వివరించడమే లక్ష్యం.. పాలకొండ, శ్రీశైలం, జగ్గయ్యపేటలో వైసీపీ బస్సు యాత్రలు

Date : 25 November 2023 08:19 AM Views : 150

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ శ్రీశైలం, జగ్గయ్యపేట, పాలకొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్‌ ప్రభుత్వం చేసిన మంచిని వివరించడమే లక్ష్యంగా సాగుతున్న యాత్రలతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది వైసీపీ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు.. వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం.. పాలకొండ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. పేద, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతతోపాటు రాజ్యాంగ పదవుల్లోనూ అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా.. బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్‌తోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుకు పెత్తందారులపై ప్రేమ ఉంటే.. జగన్‌కు పేదలంటే ప్రేమ అని గుర్తు చేశారు మంత్రి విడదల రజిని. . నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరిగింది. దానిలో భాగంగా.. ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావుతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువులపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ కుట్ర చేశారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :