Saturday, 18 May 2024 01:42:01 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గృహ నిర్మాణ శాఖ సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Date : 16 November 2023 11:58 PM Views : 78

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీ గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. హౌసింగ్‌ స్కీమ్‌ కింద ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అక్టోబర్‌లో మహిళలకు 7లక్షల 43వేల ఇళ్లను అందించింది. వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లను పూర్తి చేసే దిశగా గృహనిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. జగనన్న కాలనీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలకల్పన విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వాటి సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు . కరెంట్‌, తాగునీటి సరఫరా, సోక్‌పిట్స్‌ వున్నాయా?లేవా అనే అంశాలను ఎప్పటికప్పుడు మానిటింగ్‌ చేయాలని ఆదేశించారు సీఎం. టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా రివ్యూ నిర్వహించారాయన. టిడ్కో ఇళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు సీఎం జగన్‌. నిర్మాణాలు పూర్తిచేసుకున్న ప్రతి ఇంటినీ ఆడిట్‌ చేయాలి. సదుపాయాలు ఉన్నాయా? లేవా? చెక్‌ చేయాలి. ఎప్పటికప్పుడు ఆడిట్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :