Saturday, 18 May 2024 01:59:51 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అధ్యాపకుడి వికృత చేష్టలు! ఫోన్‌లో అసభ్య ఫొటోలు తీసి.. ఆపై బెదిరింపులు, అత్యాచారం

Date : 12 October 2023 08:45 AM Views : 80

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పవలసిన ఓ అధ్యాపకుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడాడు. తన వద్ద విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఓ విద్యార్థినిపై కన్నేసి వికృత చేష్టలకు ఒడిగట్టాడు. ఫోన్‌లో బాలిక ఫొటోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన బాలికపై మళ్లీ దాడికి దిగి అబార్షన్‌ చేయించుకోవల్సిందిగా బెదిరించాడు. ఈ దుర్మార్గుడి బుద్ధిని బాలిక పోలీసుల ఎదుట బయటపెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఓ విద్యార్థిని గతేడాది ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరింది. అదే కాలేజీలో యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్‌ నాయక్‌ అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి అప్పటికే వివాహమై ఓ కుమారుడు కూడా ఉన్నారు. రోజూ విద్యార్ధినిని ఇంటి వద్ద దించే నెపంతో మాయమాటలు చెప్పాడు. అలా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన గోవింద్‌ ఓ రోజు నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విద్యార్ధినిని అసభ్యకరంగా తన సెల్‌ ఫోన్‌లో ఫొటోలు తీశాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆమెను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో భయందోళనలకు గురైన సదరు విద్యార్థిని ఇంటర్‌ రెండో ఏడాది వేరే కాలేజీలో చదివేందుకు వెళ్లిపోయింది. వేరే కాలేజీకి మారినీ గోవింద్‌ నాయక్‌ తన వికృత చేష్టలు మానలేదు. తన ఫోన్‌లో విద్యార్ధిని అసభ్య ఫొటోలు ఉన్నాయని, ఇతరులకు వాటిపి చూపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్ధిని గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన నిందితుడు ఆబార్షన్‌ చేసుకోవాలని బెదిరించడాడు. విద్యార్ధిని అందుకు అంగీకరించకపోవడంతో దాడిక తెగబడ్డాడు. బాలికను విచక్షణా రహితంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక కడుపుపై దెబ్బలు ఉండటం చూసి గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు అధ్యాపకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :