Saturday, 27 July 2024 07:47:05 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్

సర్పంచ్‎ నుంచి ముఖ్యమంత్రిగా పూర్తి ప్రస్థానం

Date : 11 December 2023 10:17 AM Views : 133

జై భీమ్ టీవీ - జాతియం / : మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఛత్తీస్‎గఢ్‎లో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై తీవ్రంగా చర్చ నడిచింది. ఎట్టకేలకు ఈ చర్చకు తెరపడింది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ రాయ్‎పూర్‎లోని పార్టీ ఆఫీసులో హాజరై శాశనసభాపక్ష నేతను ఎన్నుకున్నారు. అందరూ కలిసి ఏకపక్షంగా సుర్గుజా ప్రాంతంలోని జష్‌పూర్‌ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణుదేవ్ సాయ్‎ పేరును తీర్మానించారు. ఈ జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో బీజేపీ తన కాషాయజెండాను ఎగురవేసింది.విష్ణుదేవ్ సాయ్ సీఎంగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు కృతజ్ఙతలు తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత గవర్నర్‎ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీ మేరకు హౌజింగ్ పథకంపై దృష్టి పెట్టారు. సర్పంచ్‎గా మొదలై ముఖ్యమంత్రి దాకా.. ఛత్తీస్‎గఢ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విష్ణుదేవ్ సాయ్ రాజకీయ ప్రయాణం సర్పంచ్‎గా ప్రారంభమైంది. ఈయన ఆదివాసీగా మంచి గుర్తింపు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‎గా గెలిచి‎ ఆ తరువాత అవిభాజ్య మధ్యప్రదేశ్‎లో తప్‎కారా శాశనసభ్యునిగా గెలిచారు. 1999, 2004, 2009లో రాయ్‎గఢ్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ మొదటి సారి ప్రధాని అయిన తరువాత ఆయన కేబినెట్‎లో మంత్రిగా కొనసాగారు. అప్పుడు ఈయనకు ఉక్కు, గనుల శాఖను కేటాయించింది అధిష్టానం. అయితే ప్రస్తుతం ఛత్తీస్‎గఢ్ రాష్ట్రానికి తొలి ఆదివాసీ ముఖ్యమంత్రిగా నియమితులై సరికొత్త చరిత్రను లిఖించారు. ఈయనది పూర్తిస్థాయి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా చెప్పాలి. తండ్రితో సహా ఇద్దరు పెద్దనాన్నలు మంత్రులుగా, ఎంపీలుగా కొనసాగారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :