Sunday, 08 September 2024 06:41:11 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నడి రోడ్డుపై భార్యకు వేధింపులు.. సోషల్‌ మీడియా వేదికగా భర్త ఆవేదన

Date : 17 November 2023 12:06 AM Views : 92

జై భీమ్ టీవీ - జాతియం / : ఐటీ రాజధాని బెంగళూరులో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. రాత్రి వేళ కొందరు అంగతకులు మహిళా ఉద్యోగిపై వేధింపులకు దిగారు. తన భార్యకు ఎందురైన ఘటనను వివరిస్తూ ఆమె భర్త సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె వారి నుంచి ఎలా తప్పించుకున్న విధానాన్ని కూడా చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన దంపతులు అక్కడే వేరువేరు కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే గత గురువారం (నవంబర్ 8) రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్‌ నుంచి బయటికి వచ్చిన మహిళకు క్యాబ్‌ దొరకకపోవడంతో, తన సహోదోగ్యుల కారులో ఆమె ఇంటికి బయల్దేరింది. అయితే తమ ఇంటికి వెళ్లేలోపు మార్గం మధ్యలో సర్జాపూర్‌లో కొందరు పోకిరీలు వారి కారును మరో వాహనంలో వెంబడించారు. అలా ఆమె కారును చాలా దూరం వెంబడించారు. ఈ క్రమంలో పలుమార్లు ఆమె కారును కూడా ఢీకొట్టారు. కారును ఆపాలంటూ భీభత్సం సృష్టించారు. ఇంతలో ఆమె తెలివిగా కారును రోడ్డుమధ్యలో ఆపు చేసింది. దగ్గరకు వచ్చిన దుండగులు ఆమెను, ఆమె తోటి ఉద్యోగులను కారు నుంచి దిగాలని ఒత్తిడి చేశారు. కారులో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరికి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే వారి బెదిరింపులను లెక్క చేయకుండా కారులోనే ఉన్న మహిళ పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే లొకేషన్‌కు రావాలని భర్తతోపాటు 10 మంది స్నేహితులకు సమాచారం అందించింది. వారు సమయానికి రాకుండా ఉండిఉంటే ఈ వ్యవహారం వేరే మలుపు తిరిగి ఉండేది. ఇంతలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తన భార్యను వేధించడంపై శెట్టి అనే అతను ఎక్స్‌లో పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని సర్జాపూర్ ఇలాంటి దాడులకు హాట్‌ స్పాట్‌గా మారిందని తన పోస్టులో శెట్టి ఆవేధన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే 4-5 చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో భర్త పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరులో తాము ఎదుర్కొన్న సంఘటనలను కొందరు నెటిజన్లు పంచుకున్నారు. నేరస్థులు తరచూ వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :