Sunday, 08 September 2024 06:58:53 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కాలుష్యం పెరుగుతుందంటూ బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

Date : 07 November 2023 11:57 AM Views : 125

జై భీమ్ టీవీ - జాతియం / : రాజస్థాన్ కు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్లపై జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బోపన్న, జస్టిస్ సుందరేష్ బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీపావళి వేడుకల్లో బాణాసంచాపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం హిందువులు జరుపుకునే పెద్ద పండగల్లో ఒకటి దీపావళి. ఈ పండగ కోసం చిన్న పెద్ద ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి చిమ్మ చీకట్లను తొలగిస్తూ వెలిగించే దీపాలు.. కాల్చే బాణాసంచాతో ప్రతి ఒక్కరిలోనూ దీపావళి సంతోషాన్ని తీసుకుని వస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకల సందడి మొదలైంది. మరోవైపు దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజస్థాన్ కు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్లపై జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బోపన్న, జస్టిస్ సుందరేష్ బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. దీపావళి వేడుకల్లో బాణాసంచాపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. అంతేకాదు ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియాలని కోరాడు. గతంలో ఇచ్చిన తీర్పును దేశమంతటా అమలు చేయాలంటూ పేర్కొన్నాడు. ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లోనైనా బాణాసంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని కోరాడు పిటిషనర్. ఇదే విషయంపై రాజస్థాన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో కాలుష్యం స్థాయుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉందని ప్రతి వ్యక్తి టపాసులు వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. Tuesday Puja Tips: మంగళవారం సింధూరం, శనగలు హనుమంతుడి సమర్పించడం అత్యంత ఫలవంతం.. ఎందుకో తెలుసా.. జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ.. ఈ రోజుల్లో పిల్లలు బాణాసంచా కాల్చడం లేదని పెద్దలే బాణాసంచా ఎక్కువగా కాల్చుతున్నారని చెప్పారు. పర్యావరణానికి హాని కల్గించే అంశాలపై కేవలం కోర్టులకు మాత్రమే బాధ్యత ఉందన్న తప్పుడు భావన ప్రజల్లో ఉంది. దేశంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అంతేకాదు వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజస్థాన్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం సూచించింది. ఇదే విషయంపై పండుగ వేళల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇంతకు మించి ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వాయు కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్గించడమే ఇక్కడ ముఖ్యని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :