Saturday, 27 July 2024 01:32:44 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Date : 22 December 2023 11:31 PM Views : 164

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రీ క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అద్భుతమైన విద్యుత్ కాంతులతో, రంగురంగుల తోరణాలతో ఎల్బీ స్టేడియంను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏసుప్రభువుకు సంబంధించిన భక్తి కీర్తనలను పాడి వినిపించారు కళాకారులు. లైవ్ మ్యూజిక్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకకు క్రైస్తవ మత పెద్దలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి వేదిక పైకి చేరుకున్న వెంటనే ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి హాజరయ్యారు. కేక్ కటింగ్ కార్యక్రమం అయిన తరువాత రేవంత్ రెడ్డి ప్రసంగించారు. క్రిస్మస్ ప్రత్యేకత, క్రీస్తు గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా ముందుకు సాగాలంటే లోక్ సభ ఎన్నికల్లో మువ్వన్నెల జెండాను ఢిల్లీ కోట మీద ఎగురవేయాలన్నారు. దేశంలో రక్షణ వ్యవస్థపై అనేక అనుమానాలున్నాయని దీనికి ఉదాహరణ మణిపుర్ లో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. దేశంలో శాంతి భద్రతల దిశగా ప్రతి ఒక్క పౌరుడు అడుగులు వేయాలని అందుకు బిషబ్‎లు ఆశీర్వదించాలని కోరారు. తమ ప్రభుత్వంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :