జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కోవర్టు అనేది అపోహ మాత్రమేనని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్తో జానారెడ్డి భేటీ అయ్యారు. దిగ్విజయ్ సింగ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని.. అన్ని వివరాలు ఆయన చెప్తారని తెలిపారు. పార్టీలో ఎటువంటి గందరగోళం లేదని.. రెండు మూడురోజుల్లో అందరూ కలిసిపోతారని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ AICC సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితి, కమిటీల నియామకం, అసంతృప్తుల వాదనలు విన్నారు. BRSను ఓడించేందుకు తమ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు..ఏం చేయబోతున్నారు..? అంతర్గత సమస్యలపై అభిప్రాయాలు పరిష్కారం కోసం సలహాలు ఏంటనే వాటిపై పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రశ్నలు అడుగుతూనే మరోవైపు నేతలకు డిగ్గీ రాజా క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయతీ ప్రస్తావనే ఉండొద్దని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఎవరూ ఏం చేస్తున్నారో హైకమాండ్ అంతా గమనిస్తుందని..ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Admin