జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : వరంగల్ జై భీమ్ క్రైమ్ ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కొరఢా ఝళిపిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత నెలలుగా కాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని టాస్క్ ఫోర్స్ విభాగంలో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న వి నరేష్ కుమార్ తో పాటు టాస్క్ ఫోర్స్ విభాగంలోనే హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్యాంసుందర్ కత్తుల సోమలింగం కానిస్టేబుల్స్ సృజన్ లను సిపి రంగనాథ్ సోమవారం సాయంత్రం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి నిందితులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతుడంతో పాటు ఇతరత్రా అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Admin