Saturday, 18 May 2024 11:19:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మంత్రి గంగుల, బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

గ్రానైట్ స్కామ్​.. ఈడీ దాడులు హైదరాబాద్, కరీంనగర్ లోని 15 ప్రాంతాల్లో ఐటీతో కలిసి తనిఖీలు మంత్రి గంగుల, బంధువుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు గ్రానైట్ కంపెనీలు, క్వారీలపైనా రెయిడ్స్ దుబాయ్ నుంచి హుటాహుటిన కరీంనగర్ కు గంగుల దర్యాప్తు సంస్థలకు సహకరిస్తమని వెల్లడి

Date : 10 November 2022 09:25 AM Views : 204

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఉమ్మడి ఏపీలో జరిగిన గ్రానైట్ ఎగుమతుల కుంభకోణం కేసులోఈడీ, ఐటీ డిపార్ట్​మెంట్​ దర్యాప్తు ముమ్మరం చేశాయి. బుధవారం జాయింట్ ఆపరేషన్ చేపట్టి.. హైదరాబాద్, కరీంనగర్ లో ఆకస్మికంగా దాడులు చేశాయి. మంత్రి గంగుల కమలాకర్, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆఫీసులతో పాటు మరికొందరు గ్రానైట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసులు, క్వారీల్లో తనిఖీలు చేశాయి. మొత్తం 15 ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెయిడ్స్ చేశాయి. హైదరాబాద్‌‌ పంజాగుట్టలోని పీఎస్‌‌ఆర్ గ్రానైట్‌‌ ఆఫీస్‌‌, సోమాజిగూడలోని గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ ఆఫీస్‌‌, రాజేంద్రనగర్ హైదర్‌‌‌‌గూడలోని జనప్రియ అపార్ట్‌‌మెంట్స్‌‌లో ఉన్న ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, ఆఫీస్, ఆయన కుటుంబ సభ్యులు పార్టనర్స్ గా ఉన్న శ్వేత గ్రానైట్స్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. అలాగే సిటీలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, గ్రానైట్ అసోసియేషన్, అరవింద్ వ్యాస్ కంపెనీ, ఎస్ వీజీ గ్రానైట్స్ ఆఫీసులు, శంకరపట్నం, కొత్తపల్లి, బావుపేటలోని క్వారీల్లోనూ సోదాలు జరిపారు. ఈడీ, ఐటీ అధికారులు దాదాపు 20కి పైగా టీమ్స్ గా విడిపోయి, ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. 100 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బందితో భారీ బందోబస్తు కల్పించారు. కాగా, సోదాల్లో గ్రానైట్ కంపెనీలకు చెందిన కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గురువారం కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. మంత్రి ఇంటి తాళం పగులగొట్టి సోదాలు... మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి రెండ్రోజుల కింద దుబాయ్ టూర్ కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంత్రి పీఏ కిషన్ ప్రసాద్ సమక్షంలో తాళం తీయించేందుకు ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో చివరకు పగులగొట్టారు. గంగుల ఇంటితో పాటు అదే ఆవరణలో ఉన్న ఆయన సోదరుల ఇండ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు గంగుల ఆఫీస్ (మీసేవా) లో తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు పార్టనర్స్ గా ఉన్న శ్వేత గ్రానైట్స్ ఆఫీస్ మంకమ్మతోటలో ఉండగా, అక్కడా తనిఖీలు చేశారు. కాగా, దాడుల విషయం తెలిసి దుబాయ్ టూర్ లో ఉన్న గంగుల హుటాహుటిన బుధవారం అర్ధరాత్రి కరీంనగర్ కు చేరుకున్నారు. ఏంటీ కేసు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జరిగిన గ్రానైట్ ఎగుమతుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని చాలా ఫిర్యాదులు వచ్చాయి. 2008 నుంచి 2011దాకా పర్మిట్లు లేకుండా విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి ఎక్కువగా ఎగుమతి జరిగింది. ఈ అక్రమ రవాణాపై విజిలెన్స్ విచారణ చేపట్టి 2013లో రిపోర్టు ఇచ్చింది. గ్రానైట్ కంపెనీలు రూ.124.94 కోట్ల సీనరేజీ ఫీజు ఎగ్గొట్టినట్లు తేల్చింది. దీనికి 5 రెట్ల జరిమానా రూ. 624.73 కోట్లతో కలిపి మొత్తం రూ.749.66 కోట్లు చెల్లించాలని ఆయా కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ కంపెనీలు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించలేదు. దీనిపై 2013లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఎంపీ బండి సంజయ్ 2019లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఆపై 2021లో బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి ఈడీ, పీఎంవోలకు ఫిర్యాదు చేశారు. పోయినేడాది నవంబర్​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. నిజానిజాలు తేల్చాలి: గంగుల దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి తాము సంపూర్ణంగా సహకరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయాలని, నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని చెప్పారు. దుబాయ్‌‌ టూర్ కు వెళ్లిన గంగుల హుటాహుటిన హైదరాబాద్‌‌ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను దుబాయ్ లో ఉండగా ఈడీ అధికారులకు వీడియో కాల్ లో ఇంటి తాళాలు తీయమని చెప్పింది నేనే. ఇంట్లోని ప్రతి లాకర్ ను ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పాను. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులే చెప్పాలి. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. బయట దేశాల నుంచి డబ్బులు హవాలా తెచ్చామా? అనేది ఈడీ, డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా? అనేది ఐటీ చూస్తుంది. వీటికి సంబంధించి మా సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. గతంలో చాలాసార్లు, చాలామంది ఈడీ, ఐటీలకు కంప్లయింట్ చేశారు. ఈ టైమ్ లో దగ్గరుండి దర్యాప్తుకు సహకరించాలనే వెంటనే నేను విదేశాల నుంచి వచ్చాను” అని ఆయన చెప్పారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :