జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకూ 17 రోజుల్లో 41 బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబరు 3 తేదీలోపే కేసీఆర్ 26 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార రంగంలోకి దిగేలోపే.. సుడిగాలి పర్యటనలతో క్షేత్రాన్ని వేడెక్కించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్న కేసీఆర్.. అదేరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగే బహిరంగసభ నుంచి ఎన్నికల శంఖం పూరించనున్నారు. హైదరాబాద్, అక్టోబర్ 11: అందరి కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలకు రేస్ స్టార్ట్ చేసిన కె. చంద్రశేఖర్ రావు.. ఇప్పుడు గేర్మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్రావులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా..అధినేత కేసీఆర్ సైతం ఇక రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకూ 17 రోజుల్లో 41 బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు కేసీఆర్. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబరు 3 తేదీలోపే కేసీఆర్ 26 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు ప్రచార రంగంలోకి దిగేలోపే.. సుడిగాలి పర్యటనలతో క్షేత్రాన్ని వేడెక్కించాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్న కేసీఆర్.. అదేరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగే బహిరంగసభ నుంచి ఎన్నికల శంఖం పూరించనున్నారు. తెలంగాణ ఎన్నిక తేదీల ప్రకటన వచ్చిన తర్వాత జరిగే తొలి బహిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికను రెడీ చేసింది. పండుగల సమయంలో.. అయితే, ప్రచార పర్వానికి పండుగల సమయంలో కొద్దిగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దసరా, బతుకమ్మ పండుగల సమయంలో .. అంటే ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రచారంతో దూసుకుపోవాలని కారు పార్టీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఇదిలావుంటే, తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ఉమ్మడి ఖమ్మం సహా కొన్ని జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అభ్యర్థులను నిర్ణయించి.. ప్రకటించిన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 50కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి.. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. పార్టీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. దాదాపు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను రెండు, మూడుసార్లు చుట్టేలా బీఆర్ఎస్ ముఖ్యనాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెండింగులో పెట్టిన నాలుగు సీట్లలో మొత్తం 119 స్థానాలకు గాను 115 చోట్ల అభ్యర్థులను ఆగస్టులోనే ప్రకటించారు అధినేత కేసీఆర్. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి 104 మంది ఎమ్మెల్యేలుండగా.. వారిలో ఏడుగురికి మినహా మిగిలిన వారందరికీ మళ్లీ టికెట్లు కేటాయించారు. పెండింగులో పెట్టిన నాలుగు సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న జనగామ, నర్సాపూర్ స్థానాలున్నాయి. పలు దఫాల చర్చలు జరిపిన తర్వాత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్గా ప్రకటించింది. అక్కడ పల్లా రాజేశ్వర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక నర్సాపూర్లో కూడా సునీతా లక్ష్మారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చి అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఆ రెండు నియోజకవర్గాలైన గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు కూడా ఈ నెల 15న బీఫాంలు అందజేసే ఛాన్స్ ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను గుర్తించిన అధిష్టానం..అక్కడ అభ్యర్ధిపై మార్పుపై కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
Admin