Monday, 12 May 2025 08:31:02 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌.. అరెస్ట్!

Date : 21 November 2023 09:55 AM Views : 454

జై భీమ్ టీవీ - తెలంగాణ / : జనగామ, నవంబర్‌ 21: బాధ్యతగల ఓ ప్రభుత్వ అధికారి ఆమె. కానీ పనుల నిమిత్తం ఆమె వద్దకు వచ్చిన ప్రజల వద్ద అడ్డగోలుగా లంచం తీసుకోవడం పరిపాటై పోయింది. లంచం లేనిదే పని జరిగే పరిస్థితి లేదనే అపనమ్మకం అక్కడి ప్రజానీకానికి ఏర్పడేలా సదరు అధికారి ప్రవర్తించారు. ఈ క్రమంలో తాజాగా రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడింది. ఈ ఘటన తెలంగాణలోని జనగామ మున్సిపల్‌ కమిషన్‌లో చోటుచోసుకుంది. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన చెట్టిపల్లి రాజు భవన నిర్మాణం చేపట్టాడు. అందుకు ముందుగా అధికారుల వద్ద అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై గత ఏడాది జూన్‌లో జనగామ కలెక్టరేట్‌ ఎదుట జీప్లస్‌-3 భవన నిర్మాణానికి అనుమతి పొందాడు. ఈ ఏడాది సెప్టెంబరులో భవన నిర్మాణ పనులు పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణం జరిగింది. అలాగే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్‌గేజ్‌ కూడా చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సైతం తీసుకున్నారు. అయితే మున్సిపాల్టీకి కుదువ పెట్టిన 10 శాతం స్థలాన్ని విడిపించి ఇవ్వాలని చెట్టిపల్లి రాజు భావించాడు. అందుకు మున్సిపల్‌ కమిషనర్‌ రజితకు దరఖాస్తు చేశారు. స్థలాన్ని విడిపించేందుకు రూ.60 వేలు ఇవ్వాలని కమిషనర్‌ రజిత డిమాండ్‌ చేశారు. అయితే రాజు రూ.40 వేలు మాత్రమే ఇచ్చుకోగలనని విన్నవించాడు. అనంతరం బయటికి వచ్చిన రాజు ఏసీబీ అధికారులను సంప్రదించారు. మున్సిపల్ కమిషనర్‌ తన వద్ద లంచం డిమాండ్ చేసిన సంగతి వారికి తెలిపారు. అనంతరం ఏసీజీ అధికారులు తాము చెప్పినట్లు చేయమని రాజుకు తెలిపారు. వారి సూచనల మేరకు రాజు రూ.40 వేలు తీసుకెళ్లాడు. అయితే నేరుగా తనకు ఇవ్వవద్దని తన డ్రైవర్‌ నవీన్‌కు ఇవ్వాలని రజిత సూచించారు. ఇంతలో నవీన్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమిషనర్‌ రజిత ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్‌ నవీన్‌ అధికారుల అంగీకరించాడు. దీంతో ఏసీబీ అధికారులు కమిషనర్‌ రజితను, డ్రైవర్‌ నవీన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :