జై భీమ్ టీవీ - తెలంగాణ / జనగామ జిల్లా : జనగామ జిల్లా( జైభీమ్ ప్రతినిధి) (జఫర్గడ్): ఉమ్మడి వరంగల్ బాల్ బ్యాడ్మింటన్ అండర్ 19 పోటీలలో కూనూరు ఉన్నత పాఠశాలకు చెందిన కుంట శ్రీజ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైందని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న జరిగిన ఎంపిక పోటీలలో ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా కూనూరు పాఠశాల విద్యార్థిని ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పిఈటి యాదగిరి మరియు శ్రీజలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు చంద్రమోహన్, రవి, గిరిజ, ప్రభాకర్ ,స్వరూప రాణి, రాజేందర్, అనిల్ ,సిరాజ్, వేణు, విజయశ్రీ ,కరుణశ్రీ, శంకర్, ఉమా తదితరులు అభినందించారు.
Admin