జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా గురువారం రెండో విడత సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఒక్కో రోజు రెండు, మూడు సభల్లో పాల్గొననున్నారు కేసీఆర్. నవంబర్ 9వరకు నాన్స్టాప్ బహిరంగ సభలతో హోరెత్తించబోతున్నారు గులాబీ బాస్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యంగా.. బీఆర్ఎస్ స్పీడ్ పెంచుతోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేటి నుంచి మళ్లీ ప్రచార హోరెత్తించబోతున్నారు. ఇప్పటికే.. మేనిఫెస్టో ప్రకటన తర్వాత మొదటి విడత ప్రచారం కంప్లీట్ చేసిన కేసీఆర్.. మూడ్రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. దసరా నేపథ్యంలో 19 నుంచి 24 వరకు ప్రచారానికి గ్యాప్ ఇచ్చారు కేసీఆర్. మధ్యలో సొంత నియోజకవర్గం గజ్వేల్ నేతలతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు గులాబీబాస్. ఇప్పటికే ఒక విడత ప్రచారం కంప్లీట్ చేసిన కేసీఆర్. గురువారం నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వరకు నాన్స్టాప్గా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు ముఖ్యమంత్రి. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు కేసీఆర్. ఇక, గురువారం ఒక్కరోజే మూడు సభల్లో పాల్గోబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 40 నిమిషాలకు అచ్చంపేట, 3గంటలకు వనపర్తి, సాయంత్రం నాలుగున్నరకు మునుగోడు సభల్లో పాల్గోనున్నారు. ఇక, శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట సభల్లో పాల్గొంటారు కేసీఆర్. సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. నవంబర్ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మొత్తంగా.. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు గులాబీబాస్. రెండో దశ ప్రచారంతో బీఆర్ఎస్లో మరింత జోష్ నింపబోతున్నారు కేసీఆర్.
Admin