జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో కాంగ్రెస్ – కామ్రేడ్ల సీట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఐదేసి సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. చెరో రెండేసి ఇచ్చేందుకు కాంగ్రెస్సముఖంగా ఉంది. ఇందులో ఒకటి కోరుకున్న సీటు.. మరొకటి వేరోచోట ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కామ్రేడ్స్అంగీకరించడం లేదు. రెండేసి సీట్లు తాము కోరుకున్న చోట ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ను కోరుతున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తుల అంశం జాతీయ స్థాయిలోనే నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు జరిపి.. చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. సీపీఐ కోరుకున్న ఐదు సీట్లలో మునుగోడు లేదంటే కొత్తగూడెం ఇస్తామని చెప్పగా.. చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు సమాచారం. మరోటి తాము అనుకున్నట్లుగా చెన్నూరు సీటు ఇస్తామని కాంగ్రెస్చెప్పినట్టు తెలుస్తోంది. సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇస్తామంటోంది కాంగ్రెస్. మరో సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తప్పనిసరిగా సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుపడుతోంది. ఇప్పటికే సీపీఎం ప్రతిపాదించిన సీట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిరలో అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించగా.. పాలేరులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు తమకు ఇవ్వాల్సిందేనని సీపీఎం జాతీయస్థాయి నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. రెండో సీటు కింద తమకు చెన్నూరు ఇస్తామనడంపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సీటులో పోటీ చేయాల్సిందేనని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. కాంగ్రెస్ప్రతిపాదించినట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు సీటుకు ఓకే చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఐ పోటీ చేయకపోతే, పార్టీకి తీవ్ర నష్టమంటోంది.
Admin