జై భీమ్ టీవీ - తెలంగాణ / జగిత్యాల జిల్లా : జగిత్యాల మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఆవరణలో అర్ధరాత్రి వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ ఆనంద్, కాలేజ్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి కాలేజ్ క్యాంపస్ లోకి వచ్చిన ఓ ప్రభుత్వ డాక్టర్.. కులం పేరుతో తిట్టాడని వైస్ ప్రిన్సిపల్, స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కు గది ఎందుకివ్వడం లేదంటూ డాక్టర్ కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిట్టాడని వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల క్యాంపస్ కు చేరుకొని.. ఫిర్యాదు చేస్తే చర్యలు చేసుకుంటామని తెలిపారు. దీంతో సుమారు 68 మెడికల్ స్టూడెంట్స్ తో వైస్ ప్రిన్సిపాల్ కాలేజ్ నుండి కాలినడకన పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాక్టర్ పై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం కావాలని అర్ధరాత్రి ఒకటి గంటకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు నచ్చచెప్పడంతో రెండు గంటలకు వెనుదిరిగారు.
Admin