Wednesday, 25 June 2025 01:37:43 PM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

తెలంగాణ డీఎస్సీ 2023 వాయిదా వేయాలంటూ వినతులు

Date : 12 October 2023 08:34 AM Views : 263

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) పరీక్షను వాయిదా వేలయాలంటూ డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం కోరింది. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి బుధవారం (అక్టోబ‌రు 10) కోరారు. ప్రస్తుతం టీఆర్‌టీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అక్టోబ‌రు 21వ తేదీ వరకు కొనసాగనుండగా. తుది దరఖాస్తు గడువును మరో వారం పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్‌ 16 నుంచి తెలంగాణ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు తెలంగాణ సార్వత్రిక ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు అక్టోబరు 16 నుంచి 26 వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె రాము బుధవారం (అక్టోబరు 10) ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, ఇంటర్‌ విద్యార్థులకు ధర్మకంచలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. ఏపీలోనాన్‌ యూనిఫాం సర్వీసులకు ‘వయోపరిమితి’ గడువు పొడిగింపు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే నాన్‌-యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు గడువు తేదీని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 34 సంవత్సరాలుగా ఉన్న వయోపరిమితిని తాజా ఉత్తర్వులతో 42 ఏళ్ల వరకు పెంచుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత కాలపరిమితి సెప్టెంబరు 30, 2023తో ముగిసింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీతోపాటు ఇతర నియామక సంస్థలు చేపట్టే ఉద్యోగ నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :