Saturday, 18 May 2024 09:22:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

స్కూల్ పిల్లలకు డి‌టి వ్యాక్సిన్ కి స్పేషల్ డ్రైవ్ నిర్వహణ

నవంబర్ 7వ తేదీ నుండి 19 వ తేదీ వరకు -- కంఠసర్పి, దనుర్వాతం వ్యాధులు ప్రబలకుండా డిటి వ్యాక్సిన్ -- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి సాంబశివ రావు

Date : 05 November 2022 06:24 PM Views : 339

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : పి‌ల్లలలో ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధులు రాకుండా జిల్లాలోని 5వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విధ్యార్థులకు (10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు, 16 సంవత్సరాల వయసున్న వారు) డి‌టి వ్యాక్సిన్ ను వేసేందుకు ఈ నెల 7వ తేదీ నుండి 19 వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి సాంబశివ రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణముగా జిల్లా కలెక్టర్ సూచనలతో ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. దీనికి సంబoదించి ప్రోగ్రాం అధికారులతో డి‌ఎం‌హెచ్‌ఓ కార్యాలయంలో సమావేశంలో నిర్వహించడం జరిగింది. పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ ఇస్తున్నామని, కోవిడ్ కారణముగా అందరికీ ఇవ్వలేక పోయినందుకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు, 16 సంవత్సరాల వయసున్న వారందరికి (గత 6 నెలల కాలంలో టి‌డి వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మినహయిoచి) వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని కొరకై జిల్లా వ్యాప్తంగా 26 ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 34838 మందికి వ్యాక్సినేషన్ చేయనున్నట్లు సంభoదిత విద్యా శాఖా మరియు జిల్లా సంక్షేమ శాఖ వారి సహకారంతో నిర్వహించనున్నట్లు, ధనుర్వాతము ఏ వయస్సు లోని వారికైనా రావచ్చని దీని ప్రభావం వల్ల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉందని, కంఠసర్పి వ్యాధి ఏపిడమిక్ల రూపoలో ప్రభలుతుందని, కౌమార వయస్సులోని వారిలో ఎక్కువగా కనపడుతుందని, ముఖ్యoగా పాఠశాలలను కేంద్రీ కృతం చేసుకొని అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ టి మదన్ మోహన్ రావు, డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ యాకూబ్ పాషా, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ సి‌హెచ్ గీతా లక్ష్మి, డిటిసిఒ డాక్టర్ పి‌ఎస్ మల్లిఖార్జున్, ఎన్‌సి‌డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ వాణిశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో కె ప్రసాద్, సి‌హెచ్‌ఓ మాధవ రెడ్డి, ఎస్ఓ ప్రసన్న కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిడిఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :