Saturday, 19 April 2025 04:41:43 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

కాల్ డేటానే కీలకం

రవళి ఆత్మహత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. వరుడిపై కేసు

Date : 12 December 2022 09:34 AM Views : 353

జై భీమ్ టీవీ - తెలంగాణ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో పెళ్లికి కొన్ని గంటల ముందు పెళ్లి కూతురు రవళి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. పెళ్లి కొడుకు వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు రవళి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న రవళి పెళ్లికి కొన్ని గంటల ముందు ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలిచివేసింది. పెళ్లి వేడుకల్లో డాన్స్‌ సైతం చేసిన రవళి రాత్రి సంతోష్‌తో ఫోన్లో మాట్లాడిన తరువాత ఆమె డల్‌గా మారిపోయిందని అంటున్నారు. ఆస్తి కోసం, జాబ్ చేయాల‌ని సంతోష్‌ ఒత్తిడి చేయడంతో ర‌వ‌ళి సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కూతురు ఆత్మహత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు తాజాగా.. వరుడు సంతోష్‌పై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. రవళి, సంతోష్‌ కాల్‌డేటాను సేకరిస్తున్నారు.సంతోష్‌ ఒత్తిడితోనే రవళి ఆత్మహత్య చేసుకుందంటున్నారు అమ్మాయి కుటుంబసభ్యులు. ఖచ్చితంగా జాబ్‌ చేయాలని పట్టుబట్టాడని.. అలాగే ఆస్తిలో వాటా కావాలని డిమాండ్‌ చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే అవన్నీ అవాస్తవాలంటున్నాడు సంతోష్‌. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నాడు.అప్పటివరకు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా ఉన్న రవళి..అంతలోనే ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటన్న అంశంపై నిజానిజాలేంటన్నది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :