జై భీమ్ టీవీ - తెలంగాణ / : సార్వత్రిక సంగ్రామంలో బరిలో నిలిచిన చాలా మంది అభ్యర్థుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పరివారంతో వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినూత్న కార్యక్రమాలతో జనంలో, ఇటు మీడియాలో చర్చగా మారుతున్నారు.. అయితే మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనయురాలు చేపట్టిన వినూత్న సంకల్ప దీక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనయురాలు తేజస్విని వినూత్న రీతిలో సంకల్ప దీక్ష చేపట్టారు. తన తండ్రి హ్యాట్రిక్ విక్టరీ సాధించాలనే సంకల్పంతో ఈ దీక్ష చేపట్టారు. అదేదో ఉపవాస దీక్ష కాదు. ఆమె పాదరక్షలు వదిలేసి అరి పాదాలతో నడుస్తూ.. ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకుంటున్నారు. పాదరక్షలు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న ఈ యువతి. తన తండ్రికి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రజా దీవెనలు అందించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఈ యువతి తన తండ్రి శంకర్ నాయక్ గెలుపుకోసం కాళ్లకు చెప్పులు లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో మొత్తం 113 గ్రామాలు ఉండగా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ, తన తండ్రి గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కూతురు పాదరక్షలు వదిలేసి వినూత్నదీక్ష చేపట్టడం జనంలో చర్చగా మారింది. అయితే తేజస్విని మాత్రం తన తండ్రి మూడవసారి ఎమ్మెల్యే అయ్యేంతవరకు పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ బూనారు. పాదరక్షలు వదిలేసి ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ యువతి చేస్తున్న సంకల్పదీక్ష ఇప్పుడు మహబూబాబాద్ లో ఆసక్తి చర్చగా మారింది ఈ యువతి సంకల్ప దీక్ష ఫలిస్తుందో లేదో చూడాలి..!
Admin