Saturday, 18 May 2024 11:19:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తండ్రి గెలుపు కోసం తనయురాలు తాపత్రయం.. వినూత్న దీక్ష చేపట్టిన ఆ ఎమ్మెల్యే కూతురు

Date : 07 November 2023 11:31 AM Views : 64

జై భీమ్ టీవీ - తెలంగాణ / : సార్వత్రిక సంగ్రామంలో బరిలో నిలిచిన చాలా మంది అభ్యర్థుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పరివారంతో వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వినూత్న కార్యక్రమాలతో జనంలో, ఇటు మీడియాలో చర్చగా మారుతున్నారు.. అయితే మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనయురాలు చేపట్టిన వినూత్న సంకల్ప దీక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనయురాలు తేజస్విని వినూత్న రీతిలో సంకల్ప దీక్ష చేపట్టారు. తన తండ్రి హ్యాట్రిక్ విక్టరీ సాధించాలనే సంకల్పంతో ఈ దీక్ష చేపట్టారు. అదేదో ఉపవాస దీక్ష కాదు. ఆమె పాదరక్షలు వదిలేసి అరి పాదాలతో నడుస్తూ.. ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకుంటున్నారు. పాదరక్షలు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న ఈ యువతి. తన తండ్రికి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రజా దీవెనలు అందించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఈ యువతి తన తండ్రి శంకర్ నాయక్ గెలుపుకోసం కాళ్లకు చెప్పులు లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో మొత్తం 113 గ్రామాలు ఉండగా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ, తన తండ్రి గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కూతురు పాదరక్షలు వదిలేసి వినూత్నదీక్ష చేపట్టడం జనంలో చర్చగా మారింది. అయితే తేజస్విని మాత్రం తన తండ్రి మూడవసారి ఎమ్మెల్యే అయ్యేంతవరకు పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ బూనారు. పాదరక్షలు వదిలేసి ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ యువతి చేస్తున్న సంకల్పదీక్ష ఇప్పుడు మహబూబాబాద్ లో ఆసక్తి చర్చగా మారింది ఈ యువతి సంకల్ప దీక్ష ఫలిస్తుందో లేదో చూడాలి..!

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :