Saturday, 18 May 2024 09:22:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వాళ్ళిద్దరి మనసులు అతికేనా.. ఎడ ముఖం.. పెడ ముఖంతో ఉన్న ఉద్దండులు కలిసి కదిలేనా..?

Date : 29 October 2023 09:36 AM Views : 67

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో BRS జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టారు. అక్కడక్కడున్న వర్గపోరుకు చెక్‌ పెట్టేలా BRS పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావును రంగంలోకి దింపారు. అసమ్మతి నేతలను దారి తెచ్చి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించేలా ఫ్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో వాలిపోయి.. పంచాయితీ తీర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ఇద్దరి మనసులు కలిసేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో దాదాపుగా బీఆర్ఎస్ కేడర్ కలిసి నడుస్తున్నారు. కానీ స్టేషన్ ఘన్‌పూర్‌లో మాత్రం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. జనగామలో బీఆర్ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న రాజయ్య.. స్టేషన్ ఘనపూర్‌లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఇద్దరు సీనియర్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేరుగా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ల్యాండవడం ఆసక్తిగా మారింది. ప్రత్యేక హెలికాప్టర్‌లో స్టేషన్ ఘనపూర్‌కు చేరుకున్న మంత్రి హరీశ్‌రావు.. బీఆర్ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరిని వెంటబెట్టుకొని జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి రాజయ్య ఇంటికి వెళ్ళారు. రాజయ్యను బుజ్జగించి బీఆర్ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత రాజయ్య, కడియం శ్రీహరి ఒకే వేదికపై కనబడటంతో బీఆర్ఎస్‌ క్యాడర్‌ కేరింతలు కొట్టింది. ఇద్దర్నీ ఒకే వేదికపై కలిపిన హరీశ్‌రావు.. జొడెడ్లలా కలిసి నడిచి.. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమoత్రి చేయాలని కోరారు. ప్రస్తుతం జనగామ ఇన్‌చార్జ్‌గా నియమించడంతో అక్కడ ప్రచారం చేస్తున్నాన్నారు తాటికొండ రాజయ్య. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇద్దరం కలిసి పనిచేస్తే స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్‌కు తిరుగేలేదన్నారు ఆ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి. హరీశ్ రావు ఉన్నంత సేపు ఎడ మొఖం పెడ మొఖం తో ఉన్న ఈ ఇద్దరూ నేతలు యదావిధిగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో నియోకవర్గస్థాయిలో ఈ ఇద్దరి పై ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తారా..! మళ్ళీ శరా మామూలే అన్నట్లు ఎప్పటిలాగే పాము ముంగిసలా కీచులాడుకుంటారా..? అనే చర్చ జరుగుతుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :