Saturday, 18 May 2024 01:11:13 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మంత్రి కేటీఆర్ విమర్శలపై బండి సంజయ్

మంత్రి కేటీఆర్ విమర్శలపై బండి సంజయ్

Date : 21 December 2022 12:20 PM Views : 238

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మంత్రి కేటీఆర్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ పై తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని..దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏం తప్పులేకుంటే డ్రగ్స్ కేసును ఎందుకు ఆపేశారని నిలదీశారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి నరనరాన అహంకారం ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. వేములవాడ, ధర్మపురికి ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తీగల గుట్టపల్లి ఆర్వోబీ నిర్లక్ష్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు. గంగాధరకు ఆర్వోబీ మంజూరయ్యిందని..దీని పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో తాను ఎవరి పేరు చెప్పలేదన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తంబాకు తింటున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేసినప్పుడు ఆయన సంస్కారం ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని..ఇది సరైన పద్ధతి కాదన్నారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :