జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : హన్మకొండ జిల్లా జై భీమ్ ప్రతినిధి : ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ ఐడిఓసిలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలన పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణినితో కలిసి, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు, సంభందిత ఎన్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా 2022-2023 మధ్య కాలంలో తొలగించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనల మేరకు తిరిగి మరోసారి క్షేత్రస్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సంభందిత ఎన్నికల అధికారులు పరిశీలించి, ఫోటో సిమిలర్ ఎంట్రీస్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఎంట్రీస్, క్షుణ్ణంగా పరిశీలించి, 15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి చర్యలు లేకుండా తొలగించబడిన ఓటర్ల జాబితాను తిరిగి మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ఓటర్లను తిరిగి ఫారం -6 ద్వారా దరఖాస్తులను స్వీకరించి, ఓటర్ జాబితాలో నమోదు చేయాలన్నారు. చనిపోయిన ఓటర్లను మరోసారి పరిశీలించి ఫారం -7లో వివరాలు పూర్తిస్థాయిలో రికార్డు చేసి, సమర్పించాలని ఆదేశించారు. బదిలీ ఓటర్లుగా తొలగించిన వారి జాబితాలో ఒకవేళ వారు ఇక్కడే నివాసం ఉన్నట్లయితే, మరోసారి ఫారం -6 ద్వారా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని, ఈ పూర్తి ప్రక్రియను పూర్తి చేయడంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ వహించలన్నారు. జిల్లాలో బూతు స్థాయి అధికారులుగా నియమించిన వారి జాబితాను పరిశీలించి, ప్రభుత్వం నుండి జీతం పొందుతున్న వారిని మాత్రమే నియమించాలని, ఎవరైనా ఇతర ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లయితే వారిని తొలగించి ప్రభుత్వరంగ ఆధీనంలో పనిచేయు వ్యక్తులను మాత్రమే నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వాసు చంద్ర, పరకాల ఆర్టీవో రాము, కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సూపరిండెంట్ జ్యోతి వరలక్ష్మి, అన్ని మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin