Saturday, 18 May 2024 01:11:23 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో స్పీడు పెంచిన కమలం పార్టీ.. జోరుగా ప్రచారం చేస్తున్న కమలదళం..

Date : 16 November 2023 11:50 PM Views : 132

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడంతో ప్రచారాన్ని స్పీడప్‌ చేసింది కమలం పార్టీ. వ్యూహాలకు పదును పెడుతూ ఆయా నియోజకవర్గాల్లో జోష్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు స్టార్‌ క్యాంపెయినర్లు, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలకు మేలు చేసే హామీలను ప్రకటిస్తామని.. అమిత్ షా మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. ఇక బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ రోజు రెండు, మూడు సభల్లో పాల్గొంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ కరీంనగర్‌, బిచ్కుంద, పటాన్‌చెరులో ప్రచారం నిర్వహించారు. సుస్థిర పాలన డబుల్ ఇంజిన్‌తోనే సాధ్యమన్నారు బండి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు అధికారంలోకి వస్తే మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యమన్నారాయన. తెలంగాణలో ఎవరు ఊహించని మెజార్టీ బీజేపీకి వస్తుందని, బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహించారు. వర్గల్‌ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్‌ను ఓడగొడితేనే గజ్వేల్‌ ప్రజలు బాగుపడతారని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌. ఈ ఎన్నికల్లో యువత కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి ఆయన ఉద్యోగం ఊడగొట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల18న తెలంగాణలో అమిత్ షా పర్యటన.. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌‌లో సభలు మరోవైపు తెలంగాణ దంగల్‌లోకి బీజేపీ అగ్రనేతలను దింపుతోంది కమలం పార్టీ. సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఈనెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గద్వాల, నల్లగొండ, వరంగల్‌ తూర్పు..మూడు నియోజకవర్గాల్లో సభలో పాల్గొంటారు. ఇక అదేరోజు బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్‌ చేయనున్నారు అమిత్‌షా. 19న జేపీ నడ్డా..తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 25 నుంచి 3 రోజుల పాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :