Saturday, 27 July 2024 09:36:48 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..

సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం

Date : 04 December 2023 08:16 AM Views : 175

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మెజార్టీ మార్క్ ను సాధించుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈక్రమంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఆదివారం రాత్రి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వనించాలని కోరారు. దీనిపై స్పందించిన తమిళసై సానుకూలంగా స్పందించారు. ఈరోజు ఉదయం సీఎల్పీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ తెలిపింది. రేవంత్ రెడ్డిని సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఢిల్లీ పెద్దలుగా వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్లు దీపాదాస్‌మున్షీ, బోసురాజు, అజయ్‌కుమార్‌, ఇన్‌ఛార్జి ఠాక్రేతో పాటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారు. వీరందరి సమక్షంలో ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత డిశంబర్ 6వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే సోమవారం ఎన్నికల సంఘం అధికారి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అప్పుడు కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు తొలి అడుగు సీఎల్పీ అధ్యక్షుడి నియామకంతో ముడి పడి ఉంటుంది కనుక నేడు రేవంత్ రెడ్డిని శాశన సభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు సిద్దమవుతున్నారు కాంగ్రెస్ నాయకులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :