Monday, 12 May 2025 07:47:16 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు

Date : 28 October 2023 08:55 AM Views : 227

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. ప్రతిపక్షాల ట్రాప్‌లో అస్సలే పడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌. మూడు బహిరంగ సభల్లో పాల్గొన్న గులాబీ బాస్‌.. లోకల్ సమస్యల్ని ప్రస్తావిస్తూ.. వాటి అమలు బాధ్యత తీసుకుంటామని భరోసానిచ్చారు. పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల టార్గెట్‌గా విమర్శలు సంధించారు. మ‌హ‌బూబాబాద్ నియోజ‌వ‌క‌ర్గంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొ్న్న కేసీఆర్‌.. జిల్లాలో గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అద్భుతమైన పంటలతో ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీతో.. ప్రజా ఆశీర్వాద సభలతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, వర్దన్నపేటలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటిచెబుతూనే.. మాయమాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల టార్గెట్‌గా విమర్శలు సంధించారు. మ‌హ‌బూబాబాద్ నియోజ‌వ‌క‌ర్గంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొ్న్న కేసీఆర్‌.. జిల్లాలో గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అద్భుతమైన పంటలతో ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీతో ఆడబిడ్డల ముఖాలు కళకళలాడుతున్నాయన్నారు. చివరగా వర్దన్నపేట సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. రింగ్‌రోడ్‌తో పూలింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని..అన్ని వర్గాలను కాపాడుకుంటున్నామన్నారు కేసీఆర్‌. అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకెళ్తూ.. కరెంట్‌, సాగు, తాగు నీటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నామని ప్రజలకు గుర్తు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :