జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. ప్రతిపక్షాల ట్రాప్లో అస్సలే పడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. మూడు బహిరంగ సభల్లో పాల్గొన్న గులాబీ బాస్.. లోకల్ సమస్యల్ని ప్రస్తావిస్తూ.. వాటి అమలు బాధ్యత తీసుకుంటామని భరోసానిచ్చారు. పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల టార్గెట్గా విమర్శలు సంధించారు. మహబూబాబాద్ నియోజవకర్గంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొ్న్న కేసీఆర్.. జిల్లాలో గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అద్భుతమైన పంటలతో ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీతో.. ప్రజా ఆశీర్వాద సభలతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, వర్దన్నపేటలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటిచెబుతూనే.. మాయమాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల టార్గెట్గా విమర్శలు సంధించారు. మహబూబాబాద్ నియోజవకర్గంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొ్న్న కేసీఆర్.. జిల్లాలో గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అద్భుతమైన పంటలతో ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీతో ఆడబిడ్డల ముఖాలు కళకళలాడుతున్నాయన్నారు. చివరగా వర్దన్నపేట సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రింగ్రోడ్తో పూలింగ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని..అన్ని వర్గాలను కాపాడుకుంటున్నామన్నారు కేసీఆర్. అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకెళ్తూ.. కరెంట్, సాగు, తాగు నీటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నామని ప్రజలకు గుర్తు చేశారు.
Admin