జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ దంగల్లో చిత్ర విచిత్రాలు తళుక్కుమంటున్నాయి. ఓవైపు టచ్చేస్తే కోట్లలో నోట్ల కట్టలు ..మరోవైపు హామీల హోరు.. విమర్శల జోరు.. ఎక్కడ చూడు ఎలక్షన్ మూడ్ కన్పిస్తోంది. మధ్య మధ్యలో కర్నాటకం కూడా రీసౌండ్ ఇస్తోంది. మహాభారత్ సీరియల్లోనే కాదు ఆ తరువాత ఎన్నో సినిమాల్లో బాణాల ఎఫెక్ట్స్చూశాం. ఇప్పుడు తెలంగాణ దంగల్ లోకి సరికొత్తగా కర్నాటక రైతు బాణం దూసుకొచ్చింది. మరి టార్గెట్ ఎవరు? ఓటేసిన చేతితో చెప్తున్నాం…అంటూ కొందరు సీన్లోకి వచ్చారు. వాళ్లెవరు? ఏమా కథ ఏంటో చదవండి.. కర్నాటకలో కరెంటు కోతలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ కొడుతోంది. ఇప్పుడు టీ పీసీసీ చీఫ్ రేవంత్ ఇలాకాలో కర్నాటక రైతులు ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కర్నాటక రైతులు ఆందోళన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మొద్దంటూ… ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మి ఓట్లేసి మోసపోయామని రైతులు చెప్పారు. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలని కర్నాటక రైతులు సూచించారు. తమ ప్రాంతంలో రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం నిర్వహించారని… అందుకే తాము ఇక్కడ ప్రచారం చేస్తున్నామన్నారు వాళ్లు. ఇక నిన్న గద్వాలలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు కర్నాటక రైతులు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో నిరసనకు దిగారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంటు ఇస్తోందని..దాంతో పంటలు ఎండిపోతున్నాయంటున్నారు. అదే పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీని నమ్మి మోసపోవద్దంటూ నినాదాలు చేశారు కర్నాటక రైతులు. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్కు ఆయుధంగా మారింది. కర్నాటక రైతుల ఆందోళనతో…కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు బిఆర్ఎస్ కౌంటర్ అటాక్ షురూ చేసింది. కాంగ్రెస్ ఇచ్చే హామీల అమలుకు సాక్ష్యం కర్నాటక రైతుల ఆందోళన అంటూ గులాబీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణలో కూడా పరిస్థితి ఇలాగే అవుతుందంటోంది బీఆర్ఎస్.
Admin