Saturday, 18 May 2024 11:37:56 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. అలర్టయిన పోలీసులు.. ఒకరు అరెస్ట్..

Date : 16 November 2023 11:53 PM Views : 82

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ (బీఆర్ఎస్) దళపతి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడు పెంచారు. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. సామెతలతో సెటైర్లు.. ప్రత్యర్థులపై మాటల తూటాలు.. కాస్త సెంటిమెంట్‌ను జోడిస్తూనే జాతీయ పార్టీల తీరును గులాబీ బాస్‌ సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌ సభల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతీ సభలోనూ బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అలాగే తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. కేంద్రానికి వంద ఉత్తరాలు రాసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు కేసీఆర్‌. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు కేసీఆర్‌. కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో 58ఏళ్లు అరిగోసపడ్డామన్నారు కేసీఆర్‌. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ధోఖా చేసిందని.. అలాంటి పార్టీని మళ్లీ నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. పెట్టుబడి సాయంగా రైతు బంధు.. 24 గంటల పాటు ఉచిత కరెంట్‌.. సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించిన కేసీఆర్‌.. లేటెస్ట్‌గా జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణం ఖాయమన్నారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా ఇప్పటినుంచే ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపించింది. మొత్తానికి గులాబీ బాస్ స్పీచ్‌.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. ఇదిలాఉంటే.. మెదక్ జిల్లా, నర్సాపూర్ సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. సభ ప్రగణంలోకి వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ చెందిన అస్లాం అనే యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బుల్లెట్ స్వాధీనం విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని దృవీకరించారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా.. కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం రేపడంతో పోలీసులు భద్రతను పెంచారు. పకడ్భంధీగా బందోబస్తును నిర్వహిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :