Saturday, 18 May 2024 11:19:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణను రౌండప్ చేస్తున్న జాతీయ నేతలు.. మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోనే మోదీ మకాం

Date : 24 November 2023 08:16 AM Views : 100

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ దగ్గరపడంతో ప్రచార పర్వంలో పొలిటికల్ పార్టీలు స్పీడు పెంచాయి. అగ్రనేతలు అందరిని రంగంలోకి దింపుతున్నాయి జాతీయ పార్టీలు. మిషన్ తెలంగాణ పేరుతో దక్షిణాది మీద స్పెషల్‌గా ఫోకస్ చేసిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ నుంచి హేమా హేమీలను రప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలి విడత టూర్లతో గేరు మార్చబోతోంది కమలం పార్టీ. అంతకంటే స్పెషల్ ఏంటంటే.. నవంబర్ 24 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడే మకాం పెట్టబోతున్నారు ప్రధాని మోదీ. ‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది కమలం పార్టీ. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతలను రప్పించి విజయ సంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది బీజేపీ. గురువారమే తెలంగాణకు వచ్చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆర్మూర్‌లో జరిగే విజయసంకల్ప సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన నవంబర్ 28న మరోసారి రాష్ట్రానికి వస్తారు అమిత్ షా. ఒకేరోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 28వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడినుంచి నేరుగా మంచిర్యాలకు వెళతారు. మధ్యాహ్నం 2 నుంచి 2.45 వరకు పెద్దపల్లిలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. 3.15 నుంచి 4గంటల వరకు హుజూరాబాద్ బహిరంగసభలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ నుంచి డిల్లీకి తిరుగు పయనమవుతారు అమిత్‌షా. ఇదిలా ఉంటే… ఈ శనివారం హైదరాబాద్‌కి రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మూడు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేస్తారు. నవంబర్ 25న కామారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గాలు, 26వ తేదీన దుబ్బాక, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించి.. బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. 25వ తేదీ రాత్రికి హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో బస చేస్తారు. 26న రాత్రికి తిరుపతి చేరుకుని, 27 ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. నవంబర్ 27 సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోదీ తెలంగాణా ఎలక్షన్ టూర్ కంప్లీటౌతుంది. అమిత్‌షా, మోదీలతో పాటు ముగ్గురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలంగాణలో పర్యటిస్తారు. ఇలా సభలు, సమావేశాలు, ర్యాలీల ద్వారా ఢిల్లీ నేతలతో తెలంగాణ గల్లీల్ని హోరెత్తించాలన్నది బీజేపీ ప్రచార ఎత్తుగడ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :