Saturday, 19 April 2025 03:25:00 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

సోమేశ్ ఏం ఐడియాలు ఇస్తడని అడ్వైజర్ గా పెట్టుకున్నవ్: RS ప్రవీణ్ కుమార్

Date : 10 May 2023 05:39 PM Views : 955

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సీఎం సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించడంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇపుడున్న ఐఏఎస్ ల కంటే సోమేశ్ కుమార్ ఏం గొప్ప ఐడియాలు ఇస్తాడని చీఫ్ అడ్వైజర్ గా నియమించారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షలాది రైతుల నోట్లో మట్టిగొట్టి ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన సోమేశ్ కుమార్ ను ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో అడ్వైజర్ గా రాజీవ్ శర్మ ఉన్నారని.. ఇంకెందర్ని అడ్వజర్ లుగా నియమిస్తారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అడ్వైజర్లు, చీఫ్ అడ్వైజర్లతోనే పాలన సాగిస్తారా అనిప్రశ్నించారు. అడ్వైజర్లలో ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న 13, 14 మంది అడ్వైజర్లు ఏం పనిచేస్తున్నారో వారికి ఏడిపార్ట్ మెంట్ అప్పగించారో ప్రజలకు చెప్పాలన్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు మే9 వ తేదిన సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టారు. తన ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమేష్ కుమార్ ప్రభుత్వ సలహాదారు పోస్టులో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక ప్రచారాలు సాగాయి. బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ ..తన ముఖ్యసలహాదారుగా నియమించుకోవడం విశేషం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :