జై భీమ్ టీవీ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : జై భీమ్ న్యూస్ : మానకొండూరు నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర లో భాగంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని దోచుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ ఎత్తిన కొత్త అవతారమే బిఆర్ఎస్ ఎజెండా అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో మిగతా రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు కడుతున్నారని ఆయన విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పెరకబండ గ్రామంలోని పేదల భూమిని ఆక్రమించి కోళ్ళ ఫారం పెట్టుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.ఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించకుండా గిరిజనులను బిజెపి,టిఆర్ఎస్ ఏకమై మోసం చేస్తున్నాయని విమర్శించారు.అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు అమలు చేసిన ప్లభుత్వం,బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీల రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.బిసిల కులగణన చేయకుండా బిజెపి తెలంగాణలో అడుగు పెట్టొద్దని హెచ్చరించారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 142వ రోజు మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో పర్యటించారు.మండలంలోని అనంతగిరి రిజర్వాయర్ పేరుతో భూములు గుంజుకొని పేదలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు.ముంపుగ్రామాల్లోని భూములన్ని వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయన్నారు.నిర్వాసితుకు భూమి,దళితబంధు వంటి పథకాల ఆశచూపి మోసం చేశారన్నారు.పేదలను దోచుకున్న వంద కోట్లు ఢిల్లీలో పెట్టుబడులు పెడుతున్న దొంగలకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.డబుల్ బెడ్ రూం పథకం ఇవ్వకుండా,ఇపుడు మళ్లీ మూడు లక్షలు ఇస్తామని చెబుతున్నారని,ప్రతి నెలా జీతాలకే బడ్జెట్ లేనపుడు మూడు లక్షలు ఎలా ఇస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.బహుజన రాజ్యంలో రాష్ట్రంలోని సంపదనంతా సమానంగా జనాభా దామాషా ప్రకారం పెంచుతామని స్పష్టం చేశారు.నిరుపేదలందరికీ ఎకరం భూమి పంచిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచంద్రం,రాష్ట్ర కార్యదర్శి విశ్వం,రాష్ట్ర మహిళా నాయకురాలు శిరీష,జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్,మహిళా కన్వీనర్ సుమలత,నియోజకవర్గ అధ్యక్షులు ప్రభాకర్,లింగయ్య,యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Admin