Saturday, 18 May 2024 09:22:37 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ప్రీతి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం..ఉత్తర్వులు జారీ

Date : 21 May 2023 12:59 AM Views : 168

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. హైదరాబాద్‌ HMDA లో ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో HMDA పేర్కొంది. మెడికో ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రీతి మరణించిన తర్వాత ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందచేసింది. అదే సమయంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి కేటీఆర్ తన శాఖ పరిధిలోని HMDA లో ప్రీతి చెల్లి పూజకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు మే 20వ తేదీ శనివారం పూజను HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెడికో ప్రీతి..2023 ఫిబ్రవరి 22న పాయిజన్ ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కోమాలోకి వెళ్లిన ప్రీతిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ప్రీతిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిమ్స్‌లో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి కన్నుమూసింది

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :